తెలంగాణా ప్రజల కలలు నెరవేరిన శుభవేళ...

Publish Date:Jun 1, 2014

Advertisement

 

ఈరోజు భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణా ఆవిర్భవించడంతో తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. వారి పోరాటాలకు, బలిదానాలకు, ఆశలకు ప్రతీకగా ఏర్పడుతున్న రాష్ట్రం ఇది. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలిసిన అనేక కారణాల వలన, అవి అర్ధాంతరంగా ముగిసిపోయాయి. కానీ, తెలంగాణా ప్రజలలో ఆ ఆకాంక్ష మాత్రం నివురు గప్పిన నిప్పులా మిగిలే ఉంది. దానిని గుర్తించిన కేసీఆర్ 2001 సం.లో తెరాసను స్థాపించి, మళ్ళీ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. అయితే అప్పుడెవరూ ఆయన ఇంతవరకు పోరాడగలరని కానీ, ఆయన తెలంగాణా సాధించగలరని గానీ నమ్మలేదు.

 

కానీ కేసీఆర్ తన పోరాటం ఆపకుండా కొనసాగించడంతో, క్రమంగా ఆయన నాయకత్వ లక్షణాలపై తెలంగాణా ప్రజలకు నమ్మకం కలగింది. దానితో ఆయన పోరాటాలు ప్రజా ఉద్యమ రూపం సంతరించుకొన్నాయి. కానీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవి కొంచెం చల్లబడిపోయినట్లు కనిపించినా, ఆయన మరణాంతరం మళ్ళీ తీవ్రతరం అయ్యాయి. కేసీఆర్ 2009లో ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో అవి పతాక స్థాయికి చేరుకొన్నాయి. ఇక విధిలేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

 

ఆ తరువాత నుండి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలు ఆడిన రాజకీయ చదరంగాన్ని తెలుగు ప్రజలందరూ కనులారా చూసారు. చివరికి అత్యంత నాటకీయంగా 2014, ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది. దానితో తెలంగాణా ప్రజల పోరాటాలకు, బలిదానాలకు ఒక అర్ధం, పరమార్ధం ఏర్పడినట్లయింది. ఈరోజు అధికారికంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణా ప్రజలెన్నుకొన్న కొత్త ప్రభుత్వం కూడా ఈరోజే ఏర్పడుతోంది.

 

ఇంతవరకు పరాయిపాలనలో మగ్గుతున్నామనే భావనతో ఉన్న తెలంగాణా ప్రజలు, నేడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంగా ఉన్నారు. ఇకపై తమకు అన్నీ మంచి రోజులేననే గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం ప్రజలందరిలో కనబడుతున్నాయి. అందుకే తెలంగాణా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంబరాలలో మునిగితేలుతున్నారు. వారి కళ్ళలో ఈ సంతోషం, హృదయాలలో ఆనందం కలకాలం నిలిపే బాధ్యత ఈరోజు తెలంగాణా మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పైనే ఉంది.

 

గత పదేళ్లుగా ఆయన తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటాలు ఒక ఎత్తయితే, తనపై పూర్తి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, వారు తనపై పెట్టుకొన్న ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తెలంగాణాను త్వరితగతిన ప్రగతిపధంలో నడిపించడం మరో ఎత్తు. ఆయన ఇంతకాలంగా తెలంగాణా ప్రజల ఉద్యోగాలను, భూములను, నీళ్ళను అన్నిటినీ కూడా ఆంద్ర ప్రజలు, పాలకులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు దోచుకోన్నారని, అందువల్ల ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితేనే వారి జీవితాలు మళ్ళీ బాగుపడతాయని వాదిస్తూ, వారి నమ్మకాన్ని చూరగొని చివరికి తెలంగాణా సాధించగలిగారు. ముఖ్యమంత్రి కూడా అవగలిగారు. అందువల్ల ఇకపై దోపిడీకి ఆస్కారం లేని రాజ్యం ఏర్పడింది గనుక, ఇక తెలంగాణా ప్రజల కష్ట సుఖాలకు, మంచి చెడ్డలకు అన్నిటికీ పూర్తిగా తెలంగాణా పాలకులదే బాధ్యత అవుతుందనే విషయం సదా గుర్తుంచుకొని ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా పరిపాలించవలసి ఉంటుంది.

 

ఇంతవరకు రాష్ట్రా సాధన కోసం చేసిన పోరాటాలలో తెరాస నేతలు కనబరిచినటువంటి స్పూర్తినే ఇకపై తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతూ తెలంగాణాను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరుకొందాము.

 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేసిన అమరవీరులందరికీ తెలుగువన్ జోహారు పలుకుతోంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేతలకి, తెలంగాణా ప్రజలందరికీ తెలుగువన్ శుభాబినందనలు తెలియజేస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.