తెలంగాణా బిల్లులో అంతిమ ఘట్టమే కీలకం

Publish Date:Jan 11, 2014

Advertisement

 

ఎట్టకేలకు శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై కొంత అర్ధవంతమయిన చర్చమొదలయ్యే సమయానికి, పండగ సందర్భంగా సభ జనవరి17కి వాయిదాపడింది. వచ్చే సమావేశాల తరువాత బిల్లుని రాష్ట్రపతికి త్రిప్పి పంపవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లుని అడ్డుకొని తీరుతానని పదేపదే చెపుతునందున, ఆయన తన సహచర మంత్రులతో కలిసి బిల్లుపై తీవ్రంగా వాదించినపుడు, ప్రతిపక్షాలు కూడా అంతే ధీటుగా వారందరినీ ఎదుర్కోవచ్చును. గనుక ఈసారి సమావేశాలు మరింత ఉద్రిక్త వాతావరణంలో సాగవచ్చును. అందువల్ల బిల్లుపై అర్ధవంతమయిన చర్చకంటే సభలో వాయిదాలపర్వమే ఎక్కువ కొనసాగవచ్చును.

 

సభలో బిల్లుపై ఎంత లోతుగా చర్చ జరిగితే అన్ని అభ్యంతరాలు, లోపాలు బయటపడే అవకాశం ఉంది. అదే జరిగితే, బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళినప్పుడు వాటిపై ఆయన వివరణ, సవరణలు కోరినట్లయితే బిల్లుని పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రవేశ పెట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చుగనుక ఈసారి తెలంగాణావాదులు కూడా చర్చకు అడ్డుతగులుతూ, సభను స్తంభింపజేయవచ్చు. ఇంతకాలం బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్న వైకాపా వచ్చే సమావేశాలలో కూడా పాల్గొనకపోయినట్లయితే, ఆ పార్టీ చేస్తున్నసమైక్యవాదం భూటకమని స్పష్టం అవుతుంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి “తాను కేవలం సమైక్యనినాదం చేయదలచుకోలేదని, తన విధానమే సమైక్యవాదమని” పరోక్షంగా వైకాపాను దెప్పి పొడుస్తున్నారు.

 

అయితే, బిల్లుపై సభలో అర్ధవంతమయిన చర్చ జరిగినా జరగకున్నాదానిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేదు గనుక, బిల్లుపై శాసనసభ సభ్యులందరూ లికిత పూర్వకంగా ప్రతిపాదిస్తున్నవివిధ సవరణలే కీలకం కానున్నాయి. సవరణలు ప్రతిపాదించడానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొదట జనవరి10 గడువు విదించినప్పటికీ, అదనంగా మరో రెండు రోజులు సమయం ఇచ్చారు. ఇంతవరకు టీ-కాంగ్రెస్, తెరాస, ఇతర తెలంగాణా సభ్యులు అందరూ కలిసి స్పీకర్ కు సవరణ ప్రతిపాదనలు అందజేశారు. మజ్లిస్ సభ్యులు 31సవరణలు అందజేయగా, సీమాంధ్రకు చెందిన 44మంది తెలుగుదేశం సభ్యులు అత్యధికంగా 492 సవరణలు ప్రతిపాదిస్తూ, అంతిమంగా తాము ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేఖిస్తున్నామని తెలియజేసారు. రాష్ట్ర విభజనను సమర్ధిస్తున్న బీజేపీ మరియు సీపీఐ పార్టీలు కూడా కొన్ని సవరణలను సమర్పించాయి. లోక్‌సత్తా కూడా కొన్ని సవరణలను ప్రతిపాదించింది.

 

రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న వైకాపా బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తాము బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పీకర్‌కు ఒక లేఖ వ్రాసింది. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత బిల్లులో ప్రతీ క్లాజుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బిల్లును పూర్తిగా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రతిపాదించవచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు చేయబోయే సవరణలకు అధనంగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున లేదా ముఖ్యమంత్రి హోదాలో బిల్లులో లోపాలను ఎత్తి చూపుతూ లోప భూయిష్టమయిన ఆ బిల్లును మొత్తంగా తిరస్కరిస్తున్నట్లు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

రాష్ట్రపతి రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తే బిల్లుపై తనకు వచ్చిన అన్నిసవరణలు, అభిప్రాయాలపై కేంద్రం నుండి సంజాయిషీ కోరవచ్చును. అందువల్ల ఆయన వద్ద కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటిదాకా, కేంద్రం రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తానని చాలా గట్టిగా చెపుతున్నపటికీ, పార్లమెంటులో బిల్లుకి బీజేపీ మద్దతు పొందడం అనుమానాస్పదంగా ఉన్నందున, తెలంగాణాలో తను తక్కువ నష్టంతో బయటపడేందుకు సిద్దపడితే, ఈవంకతో బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కి పెట్టించి, ఈ సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చును. లేకుంటే, ఆయన మాట ప్రకారం మోక్కుబడిగా కొన్ని సవరణలు, హామీలు ఇచ్చి బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చును. అందువల్ల బిల్లు డిల్లీకి చేరుకోగానే మరో సరికొత్త అధ్యాయం, జాతీయ పార్టీల మధ్య డ్రామా మొదలవనుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.