టెక్నాలజీ ఎఫెక్ట్.. తిరుమలలో గంటకు పది వేల మందికి శ్రీవారి దర్శనం
Publish Date:May 14, 2026
Advertisement
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. వారాంతం, పర్వదినాలలో వీరి సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. శ్రీవారి దర్శన భాగ్యం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండటం కద్దు. అలాగే కొండపై వసతి గదుల లభ్యత లేక కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీని ఆశ్రయించి భక్దులకు సులభంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన చర్యల వల్ల ఇప్పడు భకులకు మరీ జాగు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. భక్తులకు జాగు లేకుండా స్వామివారి దర్శనం లభిస్తుండటంతో కొండపై వసతి లభ్యత కూడా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణంగా తిరుమల తిరుపతి దేవస్ధానం అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ కారణం. ఈ నెలలో ఒకే రోజు తిరుమల శ్రీవారిని 91 వేల మంది భక్తులకు 12 గంటలలో దర్శించుకోగలిగారు. గతంలో అయితే ఈ సంఖ్యలో భక్తుల దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టేది. ఇక తాజాగా బుధవారం (మే 13) శ్రీవారిని 80 వేల మంది దర్శించుకున్నారు. వీరందరికీ కేవలం 8 గంటలలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. అంటే గంట వ్యవధిలో పది వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారన్న మాట. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ ద్వారా స్వల్ప వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుండటంతో.. కొండపై విడిది గదుల కొరత సమస్యే ఉత్పన్నం కావడం లేదని టీటీడీ చెబుతోంది. ఎందుకంటే దర్శనం చేసుకున్న భక్తులు వెంటనే కాటేజీలు, విడిది గదులను వెకేట్ చేస్తున్నారు. దీంతో విడిది సమస్య లేకుండా పోయిందంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ దాదాపుగా వసతి లభిస్తున్న పరిస్థితి. గతంలో అయితే శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడిన దాని కంటే ఎక్కవ సేపు వసతి గదుల కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయని భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/technology-effect-36-219800.html





