కివీస్ టెస్టులో రహానే సాహసం.. బౌలర్లపైనే టీమిండియా ఆశలు.. 

Publish Date:Nov 28, 2021

Advertisement

కాన్పూర్ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింకా రహానే సాహసం చేశారు. తాత్కాలిక కెప్టెన్ గానే ఉన్నా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూజీలాండ్ కు కేవలం 284 పరుగుల టార్గెట్ మాత్రమే ఇచ్చి.. భారత సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇంకా ఒక రోజు ఆట మొత్తం ఉన్న సమయంలో 284 పరుగుల టార్గెట్ ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం పెద్ద సాహసమే. అయినా విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా భారత ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి అందరికి  ఆశ్చర్యపరిచాడు అజింకా రహానే. 

తమ స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. రహానే ఆశలను నిజం చేస్తూ రెండో ఓవర్ లోనే వికెట్ తీశాడు అశ్విన్.  నాలుగరోజు ఆట ముగిసే సమయానికి న్యూజీలాండ్ జట్టు వికెట్ నష్టపోయి నాలుగు పరుగులు చేసింది. అంటే చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉండగా.. కివీస్ విజయానికి 280 పరుగులు కావాలి. భారత్ కు మాత్రం గెలుపు కోసం తొమ్మిది వికెట్లు కావాలి. భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఆ ధీమాతోనే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. 

కాన్పూర్ టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. మయాంక్ 17 ,  పుజారా  22 పరుగులతో ఇన్నింగ్స్ బాగానే ఆరంభించినా జేమీసన్  వీరిని విడదీశాడు. ఓ షార్ట్ పిచ్ బంతితో పుజారాను బుట్టలో వేసుకోవడంతో న్యూజిలాండ్ వికెట్ల వేట ప్రారంభించింది. అనంతరం కెప్టెన్ రహానె (4)ను అజాజ్  పటేల్ ఔట్ చేయగా.. టిమ్ సౌథీ ఒకే ఓవర్ లో మయాంక,  రవీంద్ర జడేజాను పెవిలియన్‌ పంపాడు. దీంతో భారత్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శ్రేయస్‌, అశ్విన్ ఆరో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం అందించారు. అశ్విన్ అవుటయ్యాకా అక్షర్ పటేల్ తో కలిసి ఏడో వికెట్ కు 50 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్.. తర్వాత అవుటయ్యారు. కాసేపు ఆజిన తర్వాత 234 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు రహానే. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మే 18( శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు.
విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-18
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.