ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి

Publish Date:Sep 21, 2018

Advertisement

 

ఏపీలో ఎన్నికలకు 8 నెలల సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమైంది.. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహించి, గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది.. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది.. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్ ను కలుస్తున్నారు.. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు.. వారిలో ఎవరైతే బాగుందన్న సమాచారాన్ని రాబడుతున్నారు.. గెలుపు ఎవరికి దక్కుతుంది?.. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు?.. లాంటి ప్రశ్నలను పార్టీ కేడర్ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు.. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ ను సంప్రదింపులు జరిపారు.. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.. తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది.. జనరల్ స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుందన్న విషయంపై దృష్టి సారించింది..పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తోంది.

 

 


తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది.. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు.. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా ఈ స్థానాన్ని బీజేపీకి దక్కేలా చేసాయి.. టీడీపీ మద్దతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది.. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య నలిగిపోయారు.. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఈ స్తానం నుండి టీడీపీ పోటీ చేయనుంది.. అందుకు తగ్గట్టే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి?.. ఎవరి అభ్యర్థిత్వాన్నికోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు పార్టీ కేడర్ వద్ద ప్రస్తావిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది.. అందులో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసులు ఉన్నారు.. కొద్దిరోజుల క్రితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.

 


అదేవిధంగా ఉంగుటూరులో కూడా అధిష్ఠానం సర్వే నిర్వహించింది.. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరుకి ఒక సెంటిమెంట్ ఉంది.. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరిపక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపన్న సెంటిమెంట్ అందరిలోనూ పాతుకుపోయింది.. దీంతో టీడీపీ అధిష్ఠానం ఉంగుటూరుపైన ఆసక్తి కనబరుస్తోంది.. అందులో భాగంగా సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది.. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది.. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు.. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతో పాటు, ఉంగుటూరులోనూ సర్వే సాగింది.. మరోవైపు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు.. నలుగురు అభ్యర్దిత్వాల్లో ఎవరు కావాలి.. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించినట్లు సమాచారం.


నరసాపురం నియోజకవర్గంలో గెలుపోటములు, ఓటింగ్ సరళిలో హెచ్చుతగ్గులు సామాజిక సమీకరణపైనే ఆధారపడి ఉంటాయి.. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణాలపైనే ఆధారపడుతూ వస్తోంది.. మరోవైపు నరసాపురం నియోజకవర్గంలో టీడీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి.. ఒకరంటే ఇంకొకరికి పడదు.. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది.. ఇటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం నరసాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది.. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.. వీరిద్దరిలో ఎవరైతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు.. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది.. అలాగే మిగతా నియోజక వర్గాల్లోనూ సర్వే జరుపుతున్నట్టు సమాచారం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.