తెరాస మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఏ ముహూర్తంలో ఏపీలో జగన్ ఏటుబడిలో విద్యుత్, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అన్నారో కానీ.. రోజు రోజుకూ ఆయన మాటలు అక్షర సత్యాలనడానికి నిదర్శనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిస్కమ్ లు దివాళా అంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. వైసీపీ నేతలు కేటీఆర్ కు విసిరిస సవాల్ ను తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కనులారా చూద్దురు గాని రండి అంటూ ఆహ్వానం పలికిన వైసీపీ మంత్రులు ఆ తరువాత మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. మాట వరసకు వందల బస్సుల్లో రండి రాష్ట్రంలో అభివృద్ధి ‘వెలుగులు’ చూపుతాం అని ఓ సవాల్ విసిరి వదిలేశారు. మళ్లీ మళ్లీ సవాల్ చేస్తే తెలంగాణ నుంచి మంత్రులు బస్సులేసుకు వచ్చేస్తారేమోనని భయపడినట్లు ఉన్నారు. ఒక వైపు డబ్బులు లేవు మహప్రభో అంటూ కోర్టులకు విన్నపాలు చేసుకుంటూ చెల్లింపులను చెల్లు చేసేయాల్సిందిగా కోరుతూ.. మరో వైపు అభివృద్ధి పరుగులు అంటూ పొరుగు రాష్ట్రం మంత్రులకు సవాల్ చేయడం వైసీపీకే చెల్లింది. జగనన్న మాటల్లాగే ఈ సవాల్ కూడా నాలుక చివర నుంచి వచ్చిందే తప్ప.. పొరుగు రాష్ట్రం మంత్రులకు నిజంగా ఆహ్వానం పలికే దమ్మూ ధైర్యం వైసీపీ మంత్రులకు లేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం.. ముందుకు వచ్చి ఆహ్వానం వైసీపీది అయితేనేం.. మే స్వాగతిస్తున్నాం రండి అంటూ పొరుగు రాష్ట్రానికి స్వాగతం పలికింది.
మీరు రావడం కాదు మేం తీసుకువస్తామంటూ ముందుకు వచ్చింది. ఒక్క తెలంగాణ నుంచే కాదు.. ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచీ, ఇంకా కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ నేతలు, ప్రముఖులను తీసుకువచ్చి రాష్ట్రంలో ‘వెలిగిపోతున్న’ అభివృద్ధిని చూపిస్తామంటోంది.ఈ మేరకు తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను దగ్గరుండి మరీ చూపిస్తామని చెబుతున్నారు. సీపీఐ నాయకుడు నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర పరిస్థితులను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి, పాలనా వైఫల్యాలు .. విధాన లోపాలను బయటపెట్టే ఉద్దేశంతో వైసీపీ నేతల ఆహ్వానాన్నే ఉపయోగించుకోవాలని తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నేతలను ఏపీకి తీసుకొచ్చి వారికి రాష్ట్ర పరిస్థితులను చూపి సమస్యల తీవ్రత ను లోకానికి తెలియజేయాలని యోచిస్తోంది. ఈ యోచనను తెలుగుదేశం కార్యరూపంలోనికి తీసుకువస్తే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం జరుగుతుంది. టీడీపీ దూకుడు చూసి వైసీపీ మంత్రులు ఎందుకు సవాల్ చేశామురా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-responds-tp-ycp-invitation-25-135484.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.