కూటమి మేనిఫెస్టో సూపర్!.. జగన్ శిబిరం బేజార్!

Publish Date:Apr 30, 2024

Advertisement

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. అదే సమయంలో చంద్రబాబు గ్యారంటీలతో పాటుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సామాన్య జనం నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  

అందుకు భిన్నంగా జగన్ 2019లో ప్రకటించిన నవరత్నాలు కొద్దినగదు పెంపుతో  పాతమేనిఫెస్టోనే ప్రకటించడం ఆ పార్టీ నాయకులు , అభ్యర్థులలోనే అసంతృప్తి వక్తం అవుతోంది.  రైతు రుణ మాఫీ, పింఛన్లునాలుగు వేలకు పెంపు, రైతు భరోసా భారీ పెంపు ,మెగా డీఎస్సీ  వంటివి జగన్ మేనిఫెస్టోలో ఉంటాయని అంతా బావించారు. కానీ జగన్ వీటి వేటి ఊసూ తన మేనిఫెస్టోలో ఎత్తలేదు.  అలాగే జగన్ తాను ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమం ఖర్చు నెలకు 70వేల కోట్లు అవుతుందన్నారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు నెలకు లక్షా ఇరవై నుంచి 50వేలకోట్ల రూపాయలు వరకూ అవుతుందని,అది అసాధ్యమని జగన్ విమర్శలు గుప్పించారు.

దీనిపై విపక్ష తెలుగుదేశం కూటమి నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, వైసీపీ శ్రేణుల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నెలకు రూ.70వేల కోట్లు సమకూరడమే గగనమని చెబుతున్న జగన్ తన ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేసారని నిలదీస్తున్నారు.  ఇక తెలుగుదేశం కూటమి నేతలైతే తాము  సంక్షేమం తో పాటు అభివృద్ధి చూపిస్తామని, సంపద సృష్టికి, అభివృద్ధికి అసలు సిసలు చిరునామా చంద్రబాబు అని చెబుతున్నారు.  జగన్ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారన్నారు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనిపించలేదు. విడతలవారీగా మద్యపానం నిషేధం అన్నారు. కానీ   ఆచరణలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను అడ్డూ అదుపూ లేకుండా పెంచేశారని విమర్శిస్తున్నారు.  సంక్షేమం అంటూ రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో మేనిఫెస్టో కంటే ముందే తెలుగుదేశం ప్రకటించిన గ్యారంటీలు ఎంతో గొప్పగా ఉన్నాయని అభివృద్ధి సంక్షేమానికి పూచిపడుతున్నాయని ప్రశంసించారు. 

ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి తన మేనిఫెస్టోను ప్రకటించేసింది. ఇందులో 25 అంశాలను పొందుపరిచింది. దీంతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండటంతో జగన్ శిబిరం బేజారైపోతోంది. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు

1.మెగా డీఎస్సీపై తొలి సంతకం

2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000

3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000

4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500

5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం

6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు 

7.రూ.3000 నిరుద్యోగ భృతి 

8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000

9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ

10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి 

11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000 

12.ఉచిత ఇసుక 

13.అన్నా క్యాంటీన్లు 

14.భూ హక్కు చట్టం రద్దు 

15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్

16.బీసీ రక్షణ చట్టం 

17.పూర్ టూ రిచ్ పథకం

18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ

19.కరెంటు చార్జీలు పెంచం

20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్

21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం 

22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం 

23.పెళ్లి కానుక రూ.1,00,000/-

24.విదేశీ విద్య పథకం

25.పండుగ కానుకలు

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు జగన్ రావొద్దని, జగన్‌తో తమకు అవసరం లేదని, మళ్ళీ ఇంకొకసారి ఈ పెద్ద తిమింగలం అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు.. 
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు. 
సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.