అధికారంలో ఉన్నామా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నామా?

Publish Date:Nov 4, 2024

Advertisement

రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థ‌లు ఇలా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌ హ‌వా వేరే లెవ‌ల్ లో ఉంటుంది. ఓటర్లను నమోదు చేయించడం దగ్గర నుంచీ  అన్నివిధాలా ప్ర‌తిప‌క్ష పార్టీ కంటే ప‌ది అడుగులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు ముందుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో  ప‌రిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏపీలో ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మ‌డి తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే తెలుగుదేశం కూట‌మి అభ్యర్థులను ప్ ప్రకటించింది.  వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృష్ణా, గుంటూరు అభ్యర్థిని ప్రకటించింది, తెలుగేశం కూట‌మి నుంచి ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అలాగే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేరును సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రకటించారు. అయితే, అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకం.  కానీ, ఈ రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఓట‌ర్లుగా చేర్ప‌డంలో కూట‌మి ఎమ్మెల్యేలు, నేత‌లు విఫ‌మ‌వుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఓటర్ల  నమోదుకు   మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. కానీ, కూట‌మి నేత‌ల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో 3.5ల‌క్ష‌ల ఓట్ల‌కు గాను ల‌క్ష‌ మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. అదేవిధంగా ఉమ్మ‌డి కృష్ణా - గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 3.5ల‌క్ష‌ల మంది ఉంటే కేవ‌లం 1.50ల‌క్ష‌ల మంది మాత్ర‌మే ఓట‌ర్లుగా న‌మోద‌య్యారు. 

వారం రోజుల క్రితం సీఎం చంద్ర‌బాబు రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో స‌మావేశం అయ్యారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల విజ‌య‌మే ల‌క్ష్యంగా కూట‌మి పార్టీల్లోని నేత‌లు క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు.  6వ తేదీ వ‌ర‌కు ఓట్ల న‌మోదు ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని,  ఆ లోపు ఓట‌ర్ల న‌మోదును పూర్తి చేయాల‌ని ఆదేశించారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య‌నేత‌లు ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల‌ను చేర్పించ‌డంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన ఆదేశం ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఇంకొకటి. పరస్పర సమన్వయలోపం బహిర్గతమ‌వుతోంది. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవ ర్గంలో గతంలో మూడు లక్షలకుపైబడి ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓటర్ల చేర్పింపులో మాత్రం కూటమి నేతలు నిర్లిప్తంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు  కూటమి నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లేకపోవడం కూడా ఓటర్ల నమోదులో వెనుకబాటుకు దారితీసింద‌ని తెలుస్తోంది.  గ్రాడ్యుయేట్స్‌ ఎక్కువగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లి గూడెం వంటి ముఖ్యప్రాంతాలలో ఓటర్ల నమోదు అత్యధికంగా సాగాలని పక్షం రోజుల క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఏలూరులో ప్రత్యేక సమావేశం జరిగింది. కానీ ఆ త‌రువాత ఓట్ల న‌మోదులో పార్టీల నేత‌లు ఆశించిన స్థాయిలో శ్ర‌ద్ద చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. రెండు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధిక శాతం కూట‌మి ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా  ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదులో వెనుక‌బ‌టం వారి నిర్ల‌క్ష్యాన్ని ఎత్తుచూపుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ సొంత ప‌నుల‌పై దృష్టి పెట్టడం వ‌ల్ల ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదులో వెనుక‌బ‌డ‌టంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ముఖ్య‌నేత‌లు, ఎమ్మెల్యేల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇలా అయితే, రాబోయే కాలంలో క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని.. వ‌చ్చే రెండు రోజుల్లో అనుకున్న స్థాయిలో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల న‌మోదు జ‌ర‌గాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. 
ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వైసీపీ పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో దూకుడుగా వెడుతున్నది.

వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్లా కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ జీరో రిజల్ట్ సాధించింది. అయినా కూడా ఓట్ల నమోదు విషయంలో దూకుడుమీద వెడుతూ పైచేయి సాధిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.  దీంతో తాజాగా చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ను అయితే నేరుగా రాజకీయాల పట్ల సీరియస్ లేకపోతే కష్టం అని వార్నింగ్ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నియోక‌వ‌ర్గాల్లోని కూట‌మి ఎమ్మెల్యేలు, నేత‌లు రాబోయే రెండు రోజుల్లో ఏమేర‌కు ఓటర్లను న‌మోదు చేయిస్తారో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.