తెదేపా ప్రభుత్వ ఏడాది పాలనపై ఓ చిన్న సమీక్ష

Publish Date:Jun 7, 2015

Advertisement

 

తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొంది. కనుక ఈ ఏడాది పాలనపై సమీక్ష జరపవలసిన సమయం ఇది. రాష్ట్ర విభజన కారణంగా అస్తవ్యస్తంగా తయారయిన పరిపాలనను, ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. ఆ కారణంగానే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా బలమయిన ప్రభుత్వం ఒకటి ఉందనే భావన ప్రజలలో నెలకొని ఉంది.

 

కానీ ఏడాది గడుస్తున్నా హైదరాబాద్ నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి తరలిరాలేకపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ విజయవాడలో ఏర్పాటు చేసుకొన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కనుక క్రమంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా విజయవాడకు తరలిరాక తప్పదు.

 

ఇక రాష్ట్ర విభజన కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలతో బాటు, విద్యుత్, ఆర్ధిక, రాజకీయ, పరిపాలనాపరమయిన అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా వివిధ అంశాలలో తెలంగాణా ప్రభుత్వంతో ఏర్పడుతున్న గొడవల కారణంగా రాష్ట్రాభివృద్ధికి కేటాయించవలసిన విలువయిన సమయం హరించుకుపోతోంది. అవికాకుండా రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసకు అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ, అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్న వైకాపాను కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి వస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నాలుగు నెలలలోనే రాష్ట్రంలో కరెంట్ కోతలనేవీ లేకుండా చేయగలిగారు.

 

అదే విధంగా రాజధాని నిర్మాణం విషయంలో కూడా ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా వాటినన్నిటినీ ఎదుర్కొంటూ దృడంగా ముందుకే సాగుతున్నారు. ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల కారణంగా కొంత వెనుకబడినట్లే ఉన్నారు. కానీ రాష్ట్రంలో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కనుక ఇచ్చిన హామీలన్నిటినీ ఒకటొకటిగా అమలుచేయవచ్చును. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఐఐటి. ఐఐఐటి, ఐఐయం, నిట్ వంటి ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. వాటికి శాశ్విత భవనాలు ఏర్పాటు చేసేవరకు వేచి చూడాలను కోకుండా తాత్కాలికంగా వేరే ఉన్నత విద్యాసంస్థలకు చెందిన భవనాలలో ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు మొదలుపెట్టాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం, రాష్ట్రంలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా ప్రశంశనీయం. రాష్ట్ర ప్రభుత్వం తలపెడుతున్న ఈ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుండటం చాలా హర్షణీయం. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో జరుగుతున్నా ఆలస్యం, కొనసాగుతున్న సందిగ్ధత వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇబ్బందిపడవలసి వస్తోంది. త్వరలోనే రైల్వే జోన్ మరియు ప్రత్యేక హోదాపై కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతోంది.

 

రాష్ట్రంలో పరిపాలన కూడా పూర్తిగా గాడిన పడినట్లే కనబడుతోంది. కాకపోతే మంత్రులలో కొంతమంది మాత్రమే మీడియా ముందుకు వస్తుంటే మిగిలిన వారు పనిచేయడం లేదనే ఒక అపోహ ప్రజలలో నెలకొని ఉంది. కనుక మంత్రులు అందరూ కూడా విధిగా నెలకి ఒక్కసారయినా మీడియా ముందుకు వచ్చి తమ తమ శాఖలలో జరుగుతున్న ముఖ్యమయిన పనులు గురించి, రాష్ట్రాభివృద్ధి కోసం తాము చేస్తున్న కృషి గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిది.

 

రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర పరిస్థితి చూసి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందిన మాట వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న మంచి పనితీరు, పట్టుదల కారణంగా కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలలో ఇపుడు ఆ నిరాశ నిస్పృహలు దూరమవడమే కాకుండా, వేగంగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. బహుశా రానున్న నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితి మరింత మెరుగపడవచ్చును. అయితే అందుకు ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ సహకారం, ప్రభుత్వంపై నమ్మకం కూడా చాలా అవసరం. అప్పుడే ప్రభుత్వం దైర్యంగా, పూర్తి ఆత్మ విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అవగాహన, అంచనా ఏర్పడింది. ఇక మిగిలిన నాలుగేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసి చూపించ గలిగితే చంద్రబాబు నాయుడు సమర్ధత, కార్యదీక్షపై అపార నమ్మకంతో ఆయనకు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలు కూడా తాము సరయిన నిర్ణయమే తీసుకొన్నందుకు చాలా సంతోషిస్తారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.