రాజధాని భూసేకరణ పూర్తి చేయగలిగితే చాలు

Publish Date:Feb 13, 2015

Advertisement

 

రాజధాని భూసేకరణకు ఈనెల 14వ తేదీతో గడువు ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 30, 000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంటే, ఇంతవరకు 19,000 ఎకరాలు సేకరణకు రైతుల నుండి అంగీకర పత్రాలు పొందగలిగింది. కనుక మిగిలిన భూసేకరణకు మరొక రెండు వారాలు గడువు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తుళ్ళూరు మండలంలో దాదాపు తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములు ఇచ్చేందుకు అయిష్టత చూపుతున్నందున భూసేకరణ ఆలశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బలవంతంగా వారి భూములు స్వాధీనం చేసుకొనే ఆలోచనలో లేదు. వారికి ఏదో విధంగా నచ్చజెప్పి భూసేకరణ ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అప్పుడు కూడా వారు అంగీకరించకపోయినట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవలసి రావచ్చును. కానీ ఒకవేళ ప్రభుత్వం అందుకు పూనుకొంటే తుళ్ళూరు గ్రామాల ప్రజలకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా ఆచితూచి అడుగుముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే రాజధాని నిర్మాణం సంగతి అటుంచి కోర్టు కేసులతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవచ్చును.

 

ఒకవేళ ప్రభుత్వం అందుకూ సిద్దపడినా, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, వైకాపాలు రెండూ కూడా ఈ వ్యవహారానికి రాజకీయ రంగులద్ది చంద్రబాబుపై రైతు వ్యతిరేకి ముద్ర వేసే ప్రయత్నాలు చేయవచ్చును. దానివలన ఆయనకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ ఉండబోదు కానీ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం తప్పక ఉంటుంది.

 

రాజధాని నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాక ఇప్పుడు వెనక్కి తగ్గడం కూడా సాధ్యం కాదు. గనుక తప్పనిసరిగా రైతుల నుండి మిగిలిన 11, 000 ఎకరాల భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. అప్పుడే రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములను ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు కనుక, ఇంతవరకు సేకరించిన 19,000 ఎకరాలలోనే రాజధాని ప్రధాన ప్రాంతం నిర్మించే విధంగా ప్రణాళికలు మార్చుకొనేందుకు ప్రభుత్వం సిద్దపడినా, అప్పుడు భూములు ఇచ్చిన రైతులు కూడా మొరాయించే అవకాశాలుంటాయి. కనుక ఏవిధంగా చూసినా మిగిలిన భూసేకరణలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పక పోవచ్చును.

 

ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని అందరూ ముందే ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఏవిధంగా పరిష్కరించుకొంటారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించి వారితో ఎటువంటి ఘర్షణ లేకుండా ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయగలిగితే చంద్రబాబు నాయుడు మరిక వెనుతిరిగి చూసుకొనే పనే ఉండదని చెప్పవచ్చును.

 

రాజధాని ప్రధాన ప్రాంతం అభివృద్ధికి, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, గృహసముదాయాల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. సింగపూర్ మరియు జపాన్ దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ శరవేగంగా అత్యాధునిక రాజధాని నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సమస్యను నేర్పుగా అధిగమించవలసి ఉంటుంది.

 

వచ్చే ఎన్నికల నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం, వైజాగ్, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఉపయోగించుకొని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి చేయగలిగినట్లయితే తెదేపా నిర్భయంగా ప్రజలను ఓట్లు అడగి మళ్ళీ అధికారంలోకి రావచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.