Publish Date:Jun 14, 2022
ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ప్రభాస్ గురించే మాట్లాడుకుంటారు. ఇద్దరు అబ్బాయిలు కలిస్తే తమన్నా గురించే మాట్లాడుకుంటారు. ఇద్దరు పిల్లల పిల్లల తల్లులు కలిస్తే అత్తింటి ఆరళ్ల గురించే మాట్లాడుకోవచ్చు. మావాళ్లు ఇలా అంటు న్నారు అంటే మావాళ్లే నయం అని తోటికోడళ్లు కొంగులు తడిపేసుకోవడం అనాదిగా వున్నదే.
రెండు పార్టీల వారు కలిస్తే ఒకరినొకరు తిట్టుకోవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ఆదోని మండ లం బల్లేకల్లులో! ఎంతో ఆశిస్తే జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని టిడిపి నాయకుడు మీనాక్షి నాయుడిని చూసి ఆదోని బల్లేకల్లు వైసీపీ ఎంపిటీసీ సభ్యురాలు దేవీ కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లకు తనను కలిసి కష్టాలు ఏమిటని, ఎలా వున్నారని అడుగుతున్నందుకు అమాంతం ఆమె ఘొల్లుమంది. అది చూసినవారు కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో ఆశించాము కానీ ఎంతో అన్యాయం జరుగుతోందని అనుకున్నారు.
జగన్ పాలన కడు దరిద్రంగా వుందని, జగన్ని దించేయడం అందరికీ మేలని ప్రచారం చేయడంలో భాగంగా తెలుగుదేశం బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేపట్టింది. జగన్ పాలన అన్ని రంగాల్లో ప్రగతి శూన్యం, ప్రజాసంక్షేమం వూసే లేదని టిడిపి తిరుగుబాటు లేవనెత్తింది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా టిడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అందరినీ కలుస్తూ ఇక వైసీపీ ప్రభుత్వం పని అయిపోయినట్టే, రాబోయేది మన పాలనే ఇబ్బందులు తొలగిపోతాయని అందరికీ ధైర్యం చెబుతు న్నారు. అలా ఆయన ఒక ఇంటికి వెళ్లేరు. ఆ ఇంట్లో వున్నది ఎవరో కాదు స్వయానా వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు దేవీ కమ్మ.
మీనాక్షినాయుడు అందరినీ కలిసినట్టే ఆమెనీ కలవడానికి వెళ్లారు. ఇక్కడే అనుకోని సంఘటన జరిగిం ది. ఆయన్ని చూడగానే దేవీ అమాంతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమయిందక్కా.. అంటూ పలకరిస్తే వెక్కిళ్లు దిగమింగుకుంటూ అన్నా జగన్ పాలనలో అంతా గొప్పగా వుంటుందని అనుకున్నాను. కానీ ఏ మాత్రం సహాయసహకారాలు లేవు. నానా ఇబ్బందులూ పడుతున్నాము. దేనికీ ఉలకడు పలకడు. గతం లో చంద్రబాబు నాయుడుగారే వెయ్యి రెట్టు నయం అని ఏడ్చేసింది!
కష్టాలు కల కాలం వుండవు, మంచి కాలం ముందుంది, దిగులు పడకు. అంతా మంచే జరుగుతుందని మీనాక్షి నాయుడు ఆ వైసీపీ ఎంపి టీసీ దేవీ కమ్మకు ధైర్యం నూరిపోసారు. అంతేకదా.. ఏదయినా కాలమే చెబుతుంది. జగన్ పాలనలో అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. దేవీ ఒక్కరే కష్టాన్ని ఇలా తమను ఆదరించి పలకరించడానికి వచ్చినవారికి కష్టాల గోడు పెట్టుకున్నారని అనుకోవద్దు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంకెంతో మంది ఈ విధంగా బాధలు చెప్పుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-ex-mla-says-to-devi-that-jagan-rule-will-end-25-137645.html
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.