తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని చల్లార్చని మంత్రి పార్థసారథి క్షమాపణలు

Publish Date:Dec 18, 2024

Advertisement

దేశ రాజకీయ చరిత్రలో కార్యకర్తలే అండగా నిలిచి నిలబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. గెలుపు, ఓటములను చూఃసింది. ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా నిలిచారు. పలు సందర్భాలలో పార్టీకి నేతలు దూరమైనా కార్యకర్తలే పార్టీని భుజాన మోశారు. 

ఈ నలభై రెండేళ్ల ప్రస్తానంలో తెలుగుదేశం ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది.   పార్టీలోకి ఎంత మంది వచ్చినా వారందరినీ అక్కున చేర్చుకొని రాజకీయ ఓనామాలు దిద్దించింది.  క్రమశిక్షణతోపాటు రాజకీయంగా జీవితంలో ఎలా ఎదగాలి... ఆ ఎదిగే క్రమంలో ఎలా ఒదిగి ఉండాలో ఓ తల్లిగా.. ఓ తండ్రిగా.. ఓ గురువుగా..   జీవిత పాఠాలను నేర్పించింది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని కాల పరీక్షకు నిలబడి ఠీవీగా తలెత్తుకు నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.  పార్టీ పని అయిపోయిందంటూ ఇతర పార్టీలు గేలి చేసి.. గోల చేసిన ప్రతి సారి.. గతం కంటే మిన్నగా, గొప్పగా పుంజుకుని పడి లేచిన కెరటంలా నిలబడిన పార్టీ తెలుగుదేశం. పలు సందర్భాలలో ఆ పార్టీకి.. పార్టీ నుంచి అన్నీ పొందిన నేతలు ద్రోహం చేశారు. కష్టకాలంలో పార్టీని వీడి సొంత లాభం చూసుకున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెలకు హత్తుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు. అధినాయకత్వంపై నమ్మకం ఉంచారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీట. కార్యకర్తల విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత సంగతి అటుంచి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితిని మంత్రి కొలసు పార్థ సారథి ఎదుర్కొంటున్నారు.  

కొలుసు పార్థసారథి వైసీపీ సీనియర్ నాయకుడు.   2019 నుండి 24 వరకు పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అది గతం. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి గుడ్ బై చ8ెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. అందుకు ప్రధాన కారణం కొలసు పార్థసారథి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ ఆయనకు కేబినెట్ లో చోటు ఇవ్వలేదు సరికదా.. 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా నిరాకరించారు.  దీంతో ఆయన జగన్ పై తిరుగుబాటు చేసి.. వైసీపీకి గుడ్ బై చెప్పి  ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.  అయితే ఆయన చేరికకు తెలుగుదేశం క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట మన్నించి ఆయనను పార్టీలోకి అంగీకరించారు.  దీంతో తెలుగుదేశంలో ఎంట్రీ ఇచ్చిన కొలసు పార్థసారథి ఆ పార్టీ అభ్యర్థిగా  నూజివీడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా స్థానం సంపాదించారు. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు కేబినెట్ బెర్త్ దొరికింది.   అయితే మంత్రిగా ఆయన వ్యవహారశైలి పట్ల, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, వైసీపీ నుంచి తనతో పాటుగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తుండటం పార్టీ క్యాడర్ లో అసంతృప్తి జ్వాలలు రగలడానికి కారణమైంది. ఈ విషయాన్ని పలు మార్లు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది.   తెలుగుదేశం సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని కూడా కొలసు పార్థసారథిపై పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో ఆయన ఒక కార్యక్రమంలో వైసీపీ నాయకుడు  జోగి రమేష్‌తో వేదిక పంచుకోవడం పెద్ద రచ్చకు దారి తీసింది.

మూడేళ్ల కిందట  చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసులో ఏ1గా ఉన్న జోగి రమేష్‌తో కొలసు పార్థ సారథి వేదిక పంచుకోవడాన్ని తెలుగుదేశం క్యాడర్ సహించలేకపోతున్నారు. ఈ కార్యక్రమంలో గౌతు శిరీష కూడా పాల్గొన్నప్పటికీ.. ఆమె పార్టీ క్యాడర్ కు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో జోగు రమేష్ పాల్గొంటారన్న సమాచారం తనకు తెలియదని పేర్కొననారు. అయితే కొలసు పార్థసారథి కూడా క్షమాఫణలు తెలిపినప్పటికీ తెలుగుదేశం క్యాడర్ లో ఆయనపై ఆగ్రహం చల్లారలేదు. ఆయన చాలా రొటీన్ గా జోగు రమేష్ తో వేదిక పంచుకోవడంపై ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారన్న భావనే పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.  మంత్రి కొలసుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.