ఈ సామాజిక తెలంగాణా వాదనల అంతర్యమేమిటి

Publish Date:Oct 30, 2013

Advertisement

 

ఒకవైపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందనే సంతోషం ఉన్నపటికీ, కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎలా అవ్వగలమనే ప్రశ్నటీ-కాంగ్రెస్ నేతలందరి మనసులని పురుగులా ఒకటే దొలిచేస్తోంది. ఇంతకాలం రెడ్డి, కమ్మ కులస్థుల చేతిలోనే ఉండిపోయిన అధికారాన్ని, కనీసం ఇప్పుడయినా వారి చేతిలో నుండి గుంజుకోకపోతే ఇక ఎప్పటికీ సాధారణ మంత్రులుగానే మిగిలిపోవలసి వస్తుందనే భయం కొందరిని పీడిస్తుంటే, రాష్ట్రం విడిపోయిన తరువాత తమ బలం గణనీయంగా తగ్గిపోవడంతో, సదరు కులాలకి చెందిన నేతలు ఇప్పుడు ఈ ‘సామాజిక తెలంగాణా వాదులను’ అందరినీ తట్టుకొని మళ్ళీ అధికారం ఏవిధంగా చేబట్టాలాఅని మధనపడుతున్నారు.

 

మొన్న మెహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో జరిగిన టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో ఓం ప్రధమంగా సోనియా రాహుల్ భజన కార్యక్రమం పూర్తయిన తరువాత, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం, ఆర్థిక సమానత్వం లాంటి ప్రత్యేకతలు ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలని తాము కోరుకొంటున్నామని అన్నారు.

 

అంటే దానర్ధం ప్రజలకి అవన్నీ దక్కాలని కాదు. ఈ కొలమానాలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తనవంటి వారిపట్ల అమలుచేయాలని ఆయన ఉద్దేశ్యం. అనేక ఏళ్లుగా అనేక మంది ప్రజల పోరాటాల వలన, బలిదానాల వలన తెలంగాణా ఏర్పడుతోందని చెపుతున్న ఆయన ముందుగా తనకు అధికారం రావాలనే బలమయిన కోరికతోనే ఈ సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత వంటి మాటలు ప్రతీ వేదికపై పదేపదే వినిపిస్తుంటారు. ఆయన వాదనను సమర్దించేవారు కూడా మొదట తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకొంటున్నారు గనుక, ఒకవేళ వారిలో ఎవరికీ దక్కినా మిగిలినవారి ఆత్మగౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నమాట.

 

టీ-కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికోసం ఈ కులసమీకరణాల లెక్కలు ఎలా ఉన్నపటికీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్ట మొదట తామే అధికారం చేపడతామని తెరాస నేతలు కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. అదే జరిగితే టీ-కాంగ్రెస్ నేతల రూల్ నెంబర్.1,2,3 అంటే 1.సామాజిక తెలంగాణ, 2.రాజకీయ సాధికారికత, 3.ఆత్మగౌరవం మూడు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఒక దళితుడే అవుతాడని ఎంత భరోసాలు ఇస్తున్నపటికీ, మిగిలిన వారు అందరూ ఆయన కుటుంబానికి చెందిన వెలమ దొరలే అయ్యి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే వెలమదొరల చేతిలో దళిత ముఖ్యమంత్రి ఉంటారన్న మాట. అందువల్ల అప్పుడు సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది.

 

ఒకవేళ తెరాస కాంగ్రెస్ హస్తం అందుకొంటే ఆ ప్రమాదం రెట్టింపవుతుంది. కేసీఆర్ తన తెరాసను తీసుకువచ్చి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే ఆ ప్రమాదం మూడింతలయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి కావలసింది ‘సామాజిక తెలంగాణ, రాజకీయ సాధికారికత, ఆత్మగౌరవం’ కాదు. కేంద్రంలో అధికారం చెప్పటేందుకు అవసరమయిన 15 యంపీ సీట్లు మాత్రమే. అది టీ-కాంగ్రెస్ నేతలివ్వలేరని కాంగ్రెస్ అధిష్టానం గనుక గట్టిగా నమ్మినట్లయితే అప్పుడు వారిని కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను పక్కన బెట్టినట్లే పక్కన పడేసి, కేసీఆర్ హ్యాండ్ పట్టుకోవచ్చును.

 

అందువల్ల ప్రస్తుతం వారు తమ భజన కార్యక్రమం కంటిన్యూ చేసుకొంటూనే, కావాలనుకొంటే రూల్ నెంబర్.1,2,3ల గురించి ఎంతయినా గట్టిగా మాట్లడుకోవచ్చును. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పారు కూడా. కానీ, అవేవి కాంగ్రెస్ అధిష్టానానికి అర్ధం అయ్యే పదాలు కాదు గనుక తనకు బాగా అర్ధం అయ్యే యంపీ సీట్లకే ప్రాధాన్యం ఇచ్చి అందుకు తగినవారికే ‘కుర్చీ’ అప్పగించవచ్చును. అందులో కూర్చోవడానికి ఈ మూడు రూల్స్ పరిగణనలోకి తీసుకోబడకపోవచ్చును.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.