Publish Date:Oct 14, 2024
తమిళనాడులోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం నాడు జరిగిన భాగమతి ఎక్స్.ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి వుందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది. ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? సిగ్నలింగ్ వైఫల్యం వల్ల జరిగిందా? కుట్ర కోణమా? ఇతర కారణాలు ఏవైనా వున్నాయా అనే అంశాల మీద ఎన్ఐఏ, రైల్వే భద్రతా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. భాగమతి ఎక్స్.ప్రెస్ ప్రధాన లైన్లో కాకుండా లూప్ లైన్లోకి వెళ్ళి గూడ్స్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు బోగీలు కాలిపోయాయి. మొత్తం పన్నెండు బోగీలు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంపై విచారణ నిమిత్తం రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. గత సంవత్సరం ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరగడంతో ఏదైనా కుట్రకోణం వుందా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో రికార్డ్ అయిన డేటా లాగర్ని తీసుకుని, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో పరిశీలించారు. భాగమతి ఎక్స్.ప్రెస్కి ముందు మరో ట్రైన్ అదే మార్గంలో వెళ్లింది. అయితే ఆ ట్రైన్ లూప్ లైన్లోకి వెళ్ళలేదు. ఆ ట్రైన్కి, ఈ ట్రైన్కి మధ్య ఏడు నిమిషాల వ్యవధి వుంది. ఈ ఏడు నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు వున్నాయి.
రైలు ట్రాక్ మారడానికి వాడే సిగ్నలింగ్ గేర్, స్విచ్ పాయింట్ని ట్యాంపర్ చేసినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. కవరైపేట్టై స్టేషన్కి సమీపంలోనే వున్న పొన్నేరి రైల్వే స్టేషన్లో ఇటీవల పట్టాల ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసినట్టు బయటపడటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పట్టాలకు సంబంధించిన బోల్టులు, నట్లు మాయమైనట్టు గుర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-train-accident-39-186733.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.