యువ ముఖ్యమంత్రులు సమాజంలో రుగ్మతలను నిర్మూలించడానికి, అన్యాయాలను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ జనం మన్ననలు పొందడం వంటి ఘటనలు ఎక్కువగా సినిమాలలోనే చూస్తుంటాం. భరత్ అనే నేను, ఒకే ఒక్కడు ఆ కోవలోనివే. ఆ సినిమాలలో హీరో ముఖ్యమంత్రిగా అద్భుతంగా ప్రజా ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుని విలన్ల కుట్రలతో కొలువు కోల్పోతే..జనం మళ్లీ సీఎంగా ఆయననే అందలం ఎక్కిస్తారు.
వాస్తవంగా రాజకీయాలలో అటువంటి ఘటనలూ ఉండవూ, అలాంటి డ్రామా పండదు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తీరు మాత్రం మిగిలిన రాజకీయ నాయకులకు ఒకింత భిన్నంగా ఉంటుంది. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా కనబడే ఆయన జనం నుంచి వచ్చే ఫిర్యాదులపై క్షణాలలో స్పందిస్తుంటారు. తన విధాన నిర్ణయాలలో విపక్షాలనూ భాగస్వాములను చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలతో అధికారులను గాభరా పెడుతుంటారు. వారికి చెమట్లు పట్టిస్తుంటారు. తాజాగా ఒక అనాథ బాలల పాఠశాల నుంచి ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా ఆ పాఠశాలను సందర్శించారు.
సీఎం స్టాలిన్ ఆ పాఠశాలకు వెళ్లే సరికి ఇంకా ఎవరూ విధులకు హాజరు కాలేదు. నిర్ణీత సమయం దాటినా ఎవరూ రాకపోయే సరికి మరో అరగంట పాటు ఆయన వారి కోసం అక్కడే ఎదురు చూశారు. పాఠశాల, హాస్టల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న విద్యార్థులనుంచి వివరాలు సేకరించారు. టీచర్లు ఎవరూ సమయానికి రారనీ, హాస్టల్ లో సరైన వసతులు లేవనీ, చివరకు భోజనం కూడా సరిగా ఉండదన్న విద్యార్థుల సమాచారంతో ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. మొత్తం సిబ్బందిని సస్పెండ్ చేసేశారు. ఏదో సినిమాలో సన్నివేశంలా అనిపించినా... వాస్తవంగా స్టాలిన్ చేసింది అదే. ఈ చర్యతో స్టాలిన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు.
ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించడాన్ని కొనియాడుతున్నారు. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని జనం అంటున్నారు. ఏది ఏమైనా తమిళరాజకీయాలలో స్టాలిన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటే బెటర్ అని జనం అనుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-cm-reacts-immediately-tp-peoples-complaints-39-138823.html
Publish Date:Sep 10, 2026
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.