Publish Date:Mar 26, 2026
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదేళ్ల పాలన తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతకు తోడు, కొత్త పార్టీ రూపంలో విజయ్ విసురుతున్న సవాళ్లు సీఎం స్టాలిన్కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే దీన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏ మేరకు ముందుందన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ వైబ్ సంస్థ ఓట్ ట్రాకర్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్లో సంచలన విషయాలను వెల్లడించింది.
మీడియా ఛానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు విడుదల చేసిన ఓట్ వైబ్ ఒపీనియన్ పోల్లో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ ద్విముఖ పోరు తప్పదని తేల్చేసింది. డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, మరియు సీపీఎంలతో కూడిన డీఎంకే కూటమి 113 నుండి 123 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమి కూడా 106 నుంచి 116 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు. విజయ్ కొత్త పార్టీ టీవీకే 2 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు..
అటు గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు 40% మంది ప్రభుత్వ పనితీరును మంచిది లేదా చాలా మంచిది అని చెప్పారు. దాదాపు 39% మంది దానిని "పేలవమైనది" లేదా చాలా పేలవమైనది గా చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళలు డీఎంకే ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు అత్యధిక స్థాయిలో ప్రభుత్వపై సంతృప్తి వ్యక్తం చేయగా, 18-24 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు కాస్త కోపంగా ఉన్నారు. సామాజిక వర్గాలలో, ఎస్సీ/దళితులు ప్రభుత్వాన్ని అత్యంత అనుకూలంగా చూస్తున్నారు. అయితే అగ్రవర్ణ హిందువులు అత్యంత అసంతృప్తితో ఉన్నారు.
మైనారిటీ వర్గాలు సగటు కంటే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. సీఎంగా స్టాలిన్ కు 39.9 శాతం మద్దతివ్వగా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి 37.5%తో ఆయన వెనుక ఉన్నారు. పురుషులు పళనిస్వామికి మొగ్గు చూపుతుండగా, మహిళలు స్టాలిన్కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్ష మహిళా ఓటర్లు ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య చీలిపోయారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో విజయ్కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. వయోవృద్ధ ఓటర్లు ఎక్కువగా స్టాలిన్కు మద్దతుగా నిలవగా, మధ్య వయస్కులు పళనిస్వామి వైపు మొగ్గు చూపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamil-nadu-elections-39-216206.html
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.