టీ20 వరల్డ్ ముందు భారత్‌కు షాక్...కీలక ప్లేయర్ దూరం

Publish Date:Jan 8, 2026

Advertisement

 

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  జట్టులో మంచి ఫాంలో ఉన్న యువ బ్యాట్స్‌మన్ తిలక్‌వర్మకు పొట్ట కింద భాగంలో గాయమవ్వడంతో అతనికి ఆపరేషన్ చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు.  

ఆ క్రమంలో ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌‌కు ఆ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్  హజారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింద భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే స్కానింగ్ చేయించారు.

డాక్టర్ల సూచన మేరకు తిలక్‌కు తక్షణం సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే 3, 4 వారాలు ఆటకు దూరమవ్వనున్నాడు. ఫలితంగా కివీస్‌తో సిరీస్‌కు ఆ యువ బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ఇప్పటివరకు మరొకరికి జట్టులోకి తీసుకోలేదు.

ఏదేమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ. అతడు వరల్డ్ కప్‌లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

By
en-us Political News

  
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.
ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది.
మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రెండు న్యూస్‌ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.
టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు.
ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది.
దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు.
400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు.
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.