కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 లక్షణాలివే..!

Publish Date:Dec 23, 2023

Advertisement

ప్రపంచాన్ని వణికించిన మహా భూతం మళ్లీ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి తయారైంది. కరోనా ప్రపంచ దేశాలలో ఎంత మృత్యు తాండవం చేసిందో అందరికీ తెలిసిందే. దేశాలకు దేశాలు కరోనా కారణంగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని దారుణంగా చవి చూశాయి. 2020, 2021 సంవత్సరాలలో కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అందరూ మర్చిపోకముందే మళ్లీ మళ్లీ కొత్త రూపాలలో ఇది ప్రపంచం మీద దండ యాత్ర చేస్తూనే ఉంది.  2023 ముగియడానికి ముందు ఇప్పుడు మళ్లీ ప్రాణాలను బలిగొనడానికి కరోనా సిద్దమైంది.  కోవిడ్ కొత్త వెరియంట్ JN.1 ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యూఎస్ లో నమోదైంది.  అప్పటినుండి ఈ కేసులు పెరుగుతూ వస్తన్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది.

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో  కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవా నుండి వచ్చిన నమూనాలో 15కరోనా కేసులు కొనుగొన్నారు. చివరిసారిగా వచ్చిన కరోనా వేరియంట్ కంటే ఈసారి వచ్చిన వేరియంట్ ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.

కరోనా కొత్త వేరియంట్ JN.1 లక్షణాలు..  సంకేతాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే..

COVID-19 మహమ్మారి ప్రపంచానికి పరిచమైన నాలుగేళ్లు గడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇది బలితీసుకున్న ప్రాణాలు ఎన్నో..  దీని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇది రూపం మార్చుకుని  వ్యాప్తి చెందుతూనే ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో  తాజాగా బయటపడిన   JN.1 వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.Omicron XBB సబ్‌వేరియంట్ నుండి  JN.1 వేరియంట్ పుట్టిందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో  ముక్కు కారటం, గొంతు నొప్పి ,  పొడి దగ్గు వంటి చిన్న లక్షణాలు కనిపిస్తాయట. కానీ దీన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం  ముప్పు తప్పదని అంటున్నారు.

JN.1  ప్రధాన సంకేతాలు,  లక్షణాలు..

కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్  లక్షణాలు జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట. ఈ లక్షణాలు ఫ్లూ,  ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి వేరు చేయలేవు. రోగికి ఈ లక్షణాలు ఉంటే  అవి తేలికపాటివి అయితే కేవలం  ఈ జబ్బులకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కొత్త వేరియంట్ పరిస్థితి విషమించితే మాత్రం  శ్వాస ఆడకపోవడం అనే ప్రమాదకర సమస్య ఎదురవుతుంది.

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకర లక్షణాలు తెలుసుకుంటే..

దగ్గు:  నిరంతరం  దగ్గు రావడం కొత్త వేరియంట్ లో సాధారణ లక్షణం.

జలుబు :  ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.  

గొంతు నొప్పి: గొంతు నొప్పి లేదా గొంతులో అసౌకర్యం ఉంటుంది.

తలనొప్పి: JN1 వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు.

జీర్ణాశయ సమస్యలు.. అతిసారం, ఆహారం సహించలేకపోవడం, ఆకలి లేకవోవడం జీర్ణశయాంతర లక్షణాలు సంభవించవచ్చు.

తేలికపాటి శ్వాస ఆడకపోవడం: కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తేలికగా శ్వాస ఆడకపోవడం గమనించవచ్చు.  

గతంలో కరోనా కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పై లక్షణాలలో ఏవైనా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లో ఉండటం ముఖ్యం. ఇప్పుడు కరోనా గురించి భయాందోళనలు పుడుతున్న పరిస్థితులలో  జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని  విస్మరించడం వల్ల ఆ వ్యక్తికే  కాదు, కుంటుంబ సభ్యులకు చుట్టుప్రకక్ల వారికి కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.   అంతేకాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగడం మానుకోవడం,  భౌతిక దూరాన్ని పాటించడం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం వంటి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. ఎవరిని వారు కాపాడుకోవడానికి ఉన్న శక్తివంతమైన మార్గం ఇదే.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా దాన్ని తీసుకోవడం ద్వారా కరోనా ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.

                        *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు. అయితే కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం, గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు.
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది....
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.