రిషికేశ్ వెళ్లిపోయిన స్వరూపానంద్రేంద్ర స్వామి
Publish Date:Nov 26, 2024
Advertisement
జగన్ ప్రభుత్వంలో రాచ మర్యాదలు అందుకున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూప నంద్రేంద్ర స్వామి ఉన్నఫళంగా రిషికేశ్ వెళ్లిపోయారు. తనకు జగన్ ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ల ను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. తపస్సు చేసుకోవడానికి రిషికేశ్ వెళుతున్నట్లు ఆయన లేఖ రాశారు. 2019 నుంచి స్వరూపనందేద్ర స్వామికి భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. త్రి కూటమి ప్రభుత్వం కూడా భద్రతను కొనసాగించింది. గత జగన్ ప్రభుత్వం విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూములను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. భీమిలి మండలం కొత్త వలస సమీపంలో 15 ఎకరాలు జగన్ ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా విశాఖ శారదా పీఠానికి విలువైన భూములను కేటాయించడంతో కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవల్సి వచ్చింది.
http://www.teluguone.com/news/content/swaroopanandendra-swamy-who-left-rishikesh-39-189035.html





