పీసీసీ ఎంపికలో చేతులెత్తేసిన ఠాగూర్! పార్టీ సీనియర్ల తీరుపై కేడర్ ఫైర్ 

Publish Date:Dec 12, 2020

Advertisement

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అచ్చం అలానే ఉంది. వరుస పరాజయాలతో పార్టీ భవిష్యతే ఆగమ్యగోచరంగా తయారైనా.. హస్తం నేతల తీరు మాత్రం మారడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పదవి కోసం వర్గ పోరుకు తెర తీశారు. పార్టీ ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఏకాభిప్రాయంతో పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవాల్సింది పోయి.. బల ప్రదర్శనకు దిగారనే చర్చ కాంగ్రెస్ కేడర్ లో జరుగుతోంది. తనకు రాకపోయినా ఫర్వాలేదు గానీ ఫలానా వ్యక్తికి రావద్దని అడ్డుకునే ప్రయత్నాలు కొందరు చేస్తుంటే.. తనకు ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని మరికొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారట.

 

కాంగ్రెస్ నేతల తీరుతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నాలుగు రోజుల పాటు గాంధీభవన్ లో కూర్చుని కసరత్తు చేసినా పీసీసీ అధ్యక్ష ఎంపిక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఈ నెల 9న టీపీసీసీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ శనివారం వరకు జరిగింది. పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు, కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థుల నుంచి ఠాగూర్‌ విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. టీపీసీసీ రేసులో ముందు చాలా మంది నేతల పేర్లు వినిపించినా.. చివరకు మాత్రం ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని చెబుతున్నారు. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారంటున్నారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధించడంలో మాణిక్కం ఠాగూర్ కూడా చేతులెత్తేశారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది. ఎటూ తేలకపోవడంతో ఆయన కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏఐసీసీ నివేదిక ఇచ్చి తప్పించుకునే ఆలోచనలో మాణిక్కం ఠాగూర్ ఉన్నట్లు చెబుతున్నారు. 

 

యథా లీడర్ తథా కేడర్ అన్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలానే తయారయ్యారు. తమ నేతకే పీసీసీ పగ్గాలివ్వాలంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. తమ నేతకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కాని.. పీసీసీ రేసులో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలను వారు టార్గెట్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాలుగా విడిపోయి పోటాపోటీ పోస్టులు పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు వాదనకు దిగుతూ తమ పార్టీ లోపాలను వారే బయట పెట్టుకుంటున్నారు. 33 డీసీసీల్లో 20 జిల్లా అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారని రేవంత్ గ్రూప్ ప్రచారం చేస్తే.. 23 జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డికి సపోర్ట్ చేశారని కోమటిరెడ్డి గ్రూప్ కౌంటర్ పోస్టులు పెడుతోంది. సీనియర్ నేతల మాదిరిగానే కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

 

పీసీసీ చీఫ్ మార్పు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా  కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు బయటికి వస్తుంది. నేతల మధ్య మాటల యుద్ధం, గ్రూపు తగాదాలు, లుకలుకలు షరా మామూలే. సీనియర్ నేతలంతా పీసీసీ రేసులో నేనున్నాంటూ దరఖాస్తు చేసుకోవడం, లాబీయింగ్ చేసుకోవడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఎవరికి ఇచ్చినా ఇంకొరికి కోపం. సహాయ నిరాకరణ, గ్రూపుల తగాదాలు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇస్తే పార్టీ ఏమవుతుందోనని ఏఐసీసీకి భయం. సీనియారిటీ, సొంత పార్టీ వారికే అవకాశం ఇవ్వాలనే వాదన, రెడ్డి సామాజిక వర్గానికి బదులుగా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్.. ఇలా అనేకం ఆ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పీసీసీ చీఫ్ మార్పు నెత్తిమీద కుంపటిలా తయారైందని చెబుతున్నారు. పార్టీ బలోపేతం, అధికారంలోకి రావడం వంటి విషయాలు కాంగ్రెస్ సీనియర్లకు పట్టడం లేదని, పదవుల కోసమే కీచులాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

 

పార్టీ హైకమాండ్ కూడా త్వరగా పీసీసీ చీఫ్ ఎవరో తేల్చాలని, లేదంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు వెళ్లిపోయారని, మరికొందరు అదే బాటలో ఉన్నారంటున్నారు. ఇతర పార్టీలు నేతలను తన్నుకుపోవడానికి కాచుకుని ఉంటే.. పదవుల కోసం సీనియర్లు తగాదా పడటం ఎంత వరకు కరెక్ట్ అన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి వస్తోంది. సీనియర్ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లా మారిపోతుందని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నా నాయకుల అసమర్దత వల్లే పార్టీ అధికారంలోకి రాకపోయిందనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.