Publish Date:Sep 13, 2025
నేపాల్ ఇంతగా ఎందుకు తగలబడుతోంది? ఇక్కడి యువత మోడీలాంటి ప్రధాన మంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వచ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భారత దేశ ఆరాధ్య దైవం, అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడి ఉనికి ప్రశ్నార్ధకం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా కొంప ముంచిందని అన్నారు ఓలి.
నిజానికి ఓలీ ఇప్పటి వరకూ రెండు మార్లు జానకీ మాత మాత్రమే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడని అన్నారు. దీంతో అక్కడి పురావస్తు శాఖ ఇది నిరూపించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. మాములుగా అయితే అది జానకీ మాత జన్మించిన నేల. తన భర్త అంటే ఆమెకు అంత ప్రేమ. అలాంటి తన పతిదేవుడి ఉనికి ప్రశ్నార్ధకం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్రహిస్తుంది. సత్యం బయటకు రావడానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. సరిగ్గా అలాగే తాను జన్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాటలు నిజం కావని ఓప్పుకోలేదు.
రాముడికి నిజంగానే అంత పవరుందా? ఆయన్ను అన్న వారు ఇలా నామరూపాల్లేకుండా నాశనమై పోతారా? అంటే ప్రస్తుతానికైతే అదే నిజమని నిరూపితమవుతోంది. రామ జన్మ భూమి అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 5 లక్షల మంది వరకూ మరణించి ఉండవచ్చని ఒక అంచనా.
మొత్తానికి రామజన్మభూమి అన్యాక్రాంతమైన 500 ఏళ్లకు ఇప్పుడు ఇక్కడ బాలరామ ఆలయం వెలసింది. ఎవరైతే రామజన్మ భూమి అనే ఒకానొక ఉద్యమం మొదలు పెట్టారో.. వారు ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏలుతున్నారు.
అంటే రాముడు లేడని అన్న వారు ఎలా నాశనమై పోతారో.. సరిగ్గా రాముడున్నాడు, ఆయన పుట్టుక నిజం.. ఆయన పయనం నిజం.. అంతకన్నా మించి ఆయన అయోధ్యలో జన్మించింది నిజం.. అన్న వారిని అందలం ఎక్కిస్తారు. అదే ఆయన ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామచంద్రుడు. ఈ విషయం మరోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.
ఈ మాట స్వయంగా కేపీశర్మ ఓలీ అనడంతో మళ్లీ రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్రక పాత్ర. ఆయన చరిత్ర నిజం. ఆయన అయోధ్య కేంద్రంగా పాలించింది నిజం. ఆయన పితృవాక్ పాలన నిజం ఆయన ఏకపత్నీ వ్రతం నిజం ఆయన మాటకోసం నిలబడ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మరోమారు రుజువైందని అంటున్నారు శ్రీరామ భక్తులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sushila-karki-39-206108.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.