పవన్ కల్యాణ్ కుడి భుజానికి సర్జరీ.!

Publish Date:Jul 11, 2026

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను అక్కడి వైద్యులు శనివారం (జులై 11)  దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేక వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. 

విషయమేంటంటే.. పవన్ కళ్యాణ్ రెండు భుజాల  రొటేటర్ కఫ్  కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో..  వైద్యులు  మొదట కుడి భుజానికి   సర్జరీ పూర్తి చేశారు.  ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత   సర్జరీ చేయనున్నారు.ఓ  సినిమా షూటింగ్  యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్‌కు భుజాలకు గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు పూర్తి విశ్రాంతిని సూచించారు. 

అయితే.. అప్పటికే రాజకీయంగా క్రియాశీలకంగా మారడంతో పవన్ కల్యాణ్ వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోలేకపోయారు.  వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో జనసేనానితో అభిమానులు, పార్టీ  కార్యకర్తలు  కరచాలనం చేయడం, చేతులు పట్టుకుని  లాగడం వంటివి చేశారు. దీంతో  చిన్నదిగా ఉన్న సమస్య తీవ్రమైన కండరాల చీలికగా మారింది. భుజాల నొప్పి తీవ్రం కావడంతో పవన్ కల్యాణ్ గత వారం ముంబై వెళ్లి కొకిలా బెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు వెంటనే సర్జరీ అవసరమని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలు ఉండటంతో పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం (జులై 10)న ముంబై ఆస్పత్రిలో చేరారు. శనివారం (జులై 11) ఉదయం వైద్యలు ఆయనకు సర్జరీ చేశారు.  

భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ను  ప్రధాని నరేంద్ర మోదీ శ  ఫోన్ చేసి పరామర్శించారు.  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే.. తెలుగేదేశం అధినేత చంద్రబాబు, పలువురు మంత్రులు, జనసేన నేతలు, చిరంజీవి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పేడుతున్నారు.  

By
en-us Political News

  
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వివాదం అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌ను ఎలా అతలాకుతలం చేస్తున్నాయో, దీనివల్ల భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
రష్యా సైనిక డ్రోన్లలో ఐరోపా‌కు చెందిన అత్యాధునిక మైక్రోచిప్స్ విరివిగా లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తుంగలో తొక్కి, చైనా సరఫరా నెట్‌వర్క్ ద్వారా రష్యాకు చేరుతున్న ఈ రహస్య చిప్స్ మరియు గెరానియం డ్రోన్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఓకిటెల్ WP68 ఎయిర్ రగ్గడ్ ఫోన్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి. 8000mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మరియు ఆండ్రాయిడ్ 16 వంటి అద్భుతమైన ఫీచర్ల వివరాలు, ధర మరియు పనితీరు విశ్లేషణ మీకోసం.
భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లీ వరదలా వస్తున్నాయి. జూన్ నెలలో ఏకంగా 26 శాతం పెరిగిన ఈక్విటీ ఇన్‌ఫ్లోస్, టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మరియు నిపుణుల కీలక అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర ప్రారంభం కానుంది. రాబోయే రెండేళ్లలో జియో, ఎన్‌ఎస్‌ఈ సహా 210 కొత్త తరం కంపెనీలు ఐపీఓకి సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాలు మరియు మార్కెట్ అంచనాల కోసం ఇప్పుడే చదవండి!
రూ. 11,600 కోట్ల ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓ వివరాలు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మరియు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలతో వ్యాల్యుయేషన్ పోలిక, ప్రైస్ బ్యాండ్ మరియు ఇన్వెస్టర్ల లాభాల అంచనా విశ్లేషణ.
సుమారు 60 ఏళ్ల క్రితం మునిగిపోయిన అంటార్కిటికా అన్వేషకుడు సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ చివరి నౌక క్వెస్ట్ తొలి చిత్రాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. లాబ్రడార్ సముద్రంలో 390 మీటర్ల లోతులో లభించిన ఈ చారిత్రాత్మక ఓడ విశేషాలు ఇక్కడ చూడండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI డిమాండ్ కారణంగా ఏర్పడిన HBM మెమొరీ కొరతను అధిగమించేందుకు ఏఎండీ AMD సంచలన నిర్ణయం తీసుకుంది. 32GB సామర్థ్యంతో కూడిన LPDDR5X మెమొరీ-ఆన్-ప్యాకేజ్ టెక్నాలజీ వివరాలు ఇక్కడ చూడండి.
2026 నేషన్స్ ఛాంపియన్‌షిప్‌లో రగ్బీ దిగ్గజం న్యూజిలాండ్ All Blacks మరియు ఇటలీ జట్ల మధ్య జరగనున్న ఉత్కంఠభరిత మ్యాచ్ వివరాలు, గత రికార్డులు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా, ఇరాన్‌ల మధ్య సైనిక ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా 140 నుండి 40 నౌకలకు పడిపోయింది. అమెరికా 90 ఇరాన్ స్థావరాలపై దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో బదులిచ్చింది. చమురు, గ్యాస్ సంక్షోభంపై లేటెస్ట్ అప్‌డేట్స్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.