దర్యాప్తు చకచక.. వైసీపీ నేతలు గజగజ!

Publish Date:Oct 4, 2024

Advertisement

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌చందంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీయుల గొంతులో క‌ల్తీల‌డ్డూ ప‌డి వారి పరిస్థితి కక్కాలేక మింగా లేక అన్నట్లుగా తయారైంది. ఒక‌ప‌క్క కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ,  వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్వతంత్ర సిట్ ఎర్పాటు కాగానే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చకచక సాగుతుందన్న భయంతో వైసీపీయులు గజగజ వణికిపోతున్నారు. కోర్టు తీర్పు త‌రువాత మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం చూసిన ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.  

 సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని జ‌గ‌న్‌ తేల్చేశారు. ఇక ప్రత్యేక సిట్ కూడా అవసరం లేదనేశారు. . సుప్రీం కోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు.  దీంతో వైసీపీ వర్గాల్లోనే విస్మయం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తిరుప‌తిలో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అందులో తిరుప‌తి ల‌డ్డూ వివాదం ఒక‌టి. అయితే, తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం చాలా చిన్న‌ద‌ని.. అంత‌కంటే పెద్దెత్తున అవినీతికి వైసీపీ నేత‌లు పాల్ప‌డ్డార‌ని వారాహి స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ల‌డ్డూ క‌ల్తీ విష‌యంలో అడ్డంగా దొర‌క‌డంతో పాటు,  కొండ‌పై ఐదేళ్లు సాగించిన  అవినీతి అక్ర‌మాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లను వెంటాడుతోంది.

 వైసీపీ నేత‌,  టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, పొన్నంవోలు సుధాక‌ర్ రెడ్డి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌దిత‌రులు తిరుప‌తిలో క‌ల్తీ ల‌డ్డు వివాదం విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేశారు,  భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకున్నారు,  రాష్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ కాకుండా,  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాలి, సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ క‌మిటి విచార‌ణ చేయాల‌ని కోర్టును కోరారు. మొద‌టి రోజు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకొని వైసీపీ నేత‌లు వీరంగం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది. ఆధారం లేకుండా చంద్ర‌బాబు ల‌డ్డూ విష‌యంపై ఎలా మాట్లాడాడ‌ని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింద‌ని, చంద్ర‌బాబు దొరికిపోయారు,  శ్రీ‌వారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. మేము స‌త్యహ‌రిశ్చంద్రులం అన్న‌ట్లుగా త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వ్య‌తిరేకించ‌లేక, పూర్తి స్థాయిలో కోర్టు తీర్పును స్వాగ‌తించ‌లేక వైసీపీ నేత‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంబ‌టి రాంబాబు వంటి నేత‌లు   సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం.. కానీ, విచార‌ణ బృందంలో చంద్ర‌బాబు నాయుడు మ‌నుషులు ఉండొద్ద‌ని అంటున్నారు. అంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రు విచార‌ణ బృందంలో ఉన్నా వారు చంద్ర‌బాబు మ‌నుషులే అని ముద్ర‌వేయ‌డంతో పాటు,  కేంద్రం తరఫునుంచి అంటే సీబీఐ నుంచి నుంచి విచార‌ణ బృందంలో ఉన్న‌వారిని కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తారు అనే త‌ప్పుడు వాద‌న‌ను ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ నేత‌ల వ్యూహం ఉందన్న విషయం అంబటి మాటలతో తేటతెల్లమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డూ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును ఓసారి ప‌రిశీలిస్తే.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో  సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి. 

సరే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచార‌ణ‌పై మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న్ దారుడు కోరిన‌ట్లు కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. అయితే, వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌న్నీ చంద్ర‌బాబును ఉద్దేశించిన‌వి అంటూ సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్ర‌బాబుకు చివాట్లు పెట్టింద‌ని పోస్టులు పెడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. 

తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌ల‌కు కూడా తెలుసు. కానీ, త‌ప్పును ఒప్పుకోకుండా..  తాము త‌ప్పు చేయ‌లేదు, చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీ‌వారిని కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారు,  భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. సిట్ విచార‌ణ చేసినా.. స్వ‌తంత్ర ద‌ర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ చేయించినా త‌ప్పు చేశాం కాబ‌ట్టి త‌మ‌కు వ్య‌తిరేకంగానే ఫ‌లితం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ముందే ఫిక్స్ అయిపోయారనీ, అందుకే ఈ ఎదురుదాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు‌. విచార‌ణ‌లో క‌ల్తీ నెయ్యి వాడార‌ని తేలినా.. ఆ విచార‌ణ అంతా త‌ప్పుడు విచార‌ణ అని, చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే విచార‌ణ జ‌రిగింద‌ని చెప్పుకోవడానికి వీలుగా  వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప‌దేప‌దే సోష‌ల్ మీడియా, త‌మ‌కు అనుకూల మీడియా ద్వారా మేము త‌ప్పుచేయ‌లేదు.. చంద్రబాబు ప్రోద్బ‌లంతోనే విచార‌ణ బృందం త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందే ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ నేత‌లు ఇప్పటి నుంచే మొదలెట్టేశారని అంటున్నారు.  మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నా.. విచార‌ణ‌లో తిరుమల లడ్డూ ప్రసాదంలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని తేలినా.. విచార‌ణ రిపోర్టు మొత్తం చంద్ర‌బాబు మాయ అంటూ ఎదురుదాడికి జగన్  ఇప్పటి నుంచే సిద్ధ‌మ‌వుతుండ‌టం ఆయనలోని భయాన్ని, తప్పు చేశామన్న అంగీకారాన్ని తెలియచెప్పుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు. నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.