దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?

Publish Date:Oct 16, 2019

Advertisement

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది.

రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది.

అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని  పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది.

ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది.


ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.


అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు.


అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు.


చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది.
సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది.


అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు  కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.