Publish Date:Jan 23, 2025
దావోస్ లో తెలంగాణ పెట్టుబడుల వేట విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఇంధన రంగ దిగ్గజ సంస్థ సన్ పెట్రో కెమికెల్స్ రాష్ట్రంలో 45 వేల 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చంది. ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ప్రతినిథులతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను సన్ పెట్రో కెమికల్స్ సంస్థ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల సామర్ధ్యం 3 వేల 400 మెగావాట్లు కాగా వీటికి 5440 మెగావాట్ల సామర్ధ్యం ఉండే సోలార్ పవర్ ప్రాజెక్టులను అనుసంధానంొ చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ తెలిపింది.
ఈ ఒప్పందం కుదిరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిథులను అభినందించారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్య సాధనలో ఈ ఒప్పందాన్ని ఒక మైలు రాయిగా అభివర్ణించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాిలు ఏర్పడతాయన్నారు. అలాగే సన్ పెట్రో ప్రాజెక్టుల కారణంగా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా పురోగమిస్తాయన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటి సారి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sun-petro-chemicals-to-invest-in-telangana-25-191717.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.