సుబ్బిరామిరెడ్డి చరిత్ర చెప్పిన దగ్గుబాటి

Publish Date:May 29, 2013

Advertisement

 

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డి రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్ సభకు పోటీ చేయాలని పరితపిస్తున్నారు. అయితే సిట్టింగ్ యంపీ పురందేశ్వరి కూడ అక్కడి నుండే పోటీ చేయాలను కావడంతో సమస్య మొదలయింది. నాటి నుండి ఆమెకు పొగపెట్టే పనిలో పడ్డారు రెడ్డి గారు.

 

ఆమెకు ఆ సీటు పొందానికి తానూ ఏవిధంగా సహాయం చేసింది వివరిస్తూ, ఇప్పుడ తానూ పోటీ చేయాలను కొంటున్నందున ఆమె విశాఖ నుండి తప్పుకొని, నరసరావు పేట నుండి పోటీ చేసుకొంటే మంచిదని సలహా ఇచ్చారు. సిటింగ్ యంపీకే టికెట్ ఇవ్వాలని రూలేమీ లేదని మరో లాజిక్ పాయింటు కూడా చెప్పారు. ఇటీవలే సోనియా గాంధీని కలిసి, విశాఖ లో తానూ చేస్తున్న సేవా కార్యక్రమాల లిస్టు వివరించి తనకే విశాఖ టికెట్ ఇవ్వాలని నచ్చజెప్పి వచ్చారు. దానితో ఆమె తనకు హామీ ఇచ్చినట్లే భావించిన ఆయన టికెట్ పై వంద శాతం ఉండే తన నమ్మకం కాస్తా 1000 శాతానికి పెరిగినట్లు ఆయనే చాటింపు వేసుకొన్నారు. పనిలో పనిగా మళ్ళీ మరోసారి పురందేశ్వరికి నరసరావు పేటకు వెళ్ళిపొమ్మని చెప్పారు.

 

అయితే, పురందేశ్వరి మాత్రం అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపుచ్చేసారు.

 

కానీ రాన్రాను పెరుగుతున్న రెడ్డి గారి ఒత్తిడి భరించడం మాత్రం కష్టంగానే ఉండటంతో పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రంగంలో దిగక తప్పలేదు. ఆయన పీసీసీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ ‘సుబ్బిరామి రెడ్డి ‘80ల్లో నాగర్జున్ సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు చేస్తూ బ్లాకులో సిమెంట్ అమ్ముకొంటున్నపటి నుండి ఏవిధంగా పైకి వచ్చిందీ నాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి వద్దకు మేమేనాడు సహాయం కోసం వెళ్లలేదు. పైగా ఆయనే నా భార్యకి టికెట్ ఇవ్వొదంటూ హైకమండుకి లేఖ వ్రాసినట్లు కూడా మాకు తెలుసు. అయినా మేము అవన్నీపట్టించుకోలేదు. ఎందుకంటే హైకమండుకి ఎవరు ఎటువంటి వారో ఎవరికీ టికెట్ ఈయాలో బాగా తెలుసు. ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ, ఇతరులకి ఈ విధంగా ఉచిత సలహాలు ఇచ్చినపుడే సమస్య వస్తుంది, ”అని చురకలు వేసారు.

 

మరి శివ భక్తుడయిన రెడ్డిగారు ఇప్పుడు దగ్గుబాటి ఆరోపణలకు ఏవిధంగా శివ తాండవం చేస్తారొ చూడాలి.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.