భారత్ క్రికెట్ జట్టులోకి రావడానికి ఇపుడు కుర్రాళ్లు చాలామందే ఎదురుచూస్తున్నారు. గతంలో వలె ఒక్క రిద్దరే ఏళ్ల తరబడీ జట్టు బరువు బాధ్యతలతో ఇబ్బంది పడటం ఇపుడు లేదు. ఈ రోజుల్లో భారత్ క్రికెట్ క్యాంపులు ఎంతో చురుకయిన ప్లేయర్లను తయారుచేస్తోంది. బౌలర్, బ్యాటర్లను జాతీయ జట్టుకు ఎప్పు డయినా అవసరమై పిలిస్తే ఆడేంతగా తయారుచేయడంలో అకాడెమీలు కీలకపాత్ర పోషిస్తు న్నా యి. చాలాకాలం ఓపెనర్గా కె.ఎల్.రాహుల్ అన్నిస్థాయిల్లోనూ నిలకడగా ఆడుతూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.
ఇటీవల అనారోగ్యం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్లు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతే గాక, తమ వంతు అద్బుత బ్యాటింగ్తో రాణిస్తున్నారు. ఇక ఇపుడు భారత్ జట్టులోకి రాహుల్ ప్రత్యేకించి రావాల్సిన అవసరం ఏముంటుంది అని న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ స్టిరిస్ పెద్ద ప్రశ్నే సంధిం చాడు. వెస్టిండీస్తో టీ-20కి జట్టులోకి రాహుల్ని ఎంపిక చేశారు. కానీ అతనికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో అతను అవకాశం కోల్పోయాడు.
వాస్తవానికి ఏ ప్లేయరూ జాతీయజట్టు నుంచి బయటపడాలని అనుకోరు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వా లని అనుకోరు. ఒకసారి తప్పుకుంటే ఆ వచ్చే ప్లేయర్ తప్పకుండా తన స్థానాన్ని భర్తీచేసి విజృం భిస్తే తన స్థానం ప్రశ్నార్ధకమే అవుతుందన్న భయం అందరిలోనూ ఉంటుంది. ఇప్పుడు రాహుల్ విషయం లో న్యూజిలాండ్ సీనియర్ సంధించిన ప్రశ్న ఇదే. ఒకవేళ అతను మళ్లీ తిరిగి వచ్చినా రిషబ్, సూర్య కుమార్ వలె విజృంభించి మంచి స్కోర్ చేసి జట్టుకు తన అవసరాన్ని తెలియజేయగలడా అన్నదే అనుమానం. ఈ రోజుల్లో దేశంలో అనేకానేక టోర్నీలు జరుగుతున్నాయి, ఎందరో కుర్రాళ్లు ఏకంగా చిన్నస్థాయిలోనే రికార్డులు నెలకొల్పుతున్నారు. అందువల్ల భారత్ క్రికెట్కు భవిష్యత్ ఢోకా లేదనేది అందరూ అంగీకరించే అంశం. ఇదిలా ఉండగా, రాహుల్ మాత్రం తనకు ఆరోగ్యం బాగానే ఉందని, జూన్లో జరిగిన సర్జరీ విజయవంతమయిందని, మళ్లీ శిక్షణకు సిద్ధమయ్యానని ఫిట్నెస్తో తిరిగి జట్టులోకి రాగలనన్న నమ్మకాన్ని ప్రకటించాడు.
ఆగష్టు 18వ తేదీ నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఉంది. అప్పటికి తప్పకుండా టీమ్ ఇండి యాలోకి వచ్చేస్తానని ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని కె.ఎల్. రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ సారధ్యం వహిస్తున్నాడు. దీపక్ చాహర్ కూడా గాయాల నుంచి బయటపడి జట్టులోకి ఎంపికయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/styris-doubts-kl-reentry-39-141313.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.