ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ...

Publish Date:Oct 12, 2019

Advertisement

ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ...
ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది.

ఏడేళ్ల పరిశీలన
ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్నుకొన్న అభ్యర్థులని ఏడేళ్ల పాటు నిశితంగా గమనించారు. ఈ పరిశీలనలో ఉద్యోగంలో ఒత్తిడికీ, మరణాలకీ ఖచ్చితమైన సంబంధం బయటపడింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారు త్వరగా చనిపోయేందుకు 15.4 శాతం అధికమైన అవకాశం ఉన్నట్లు తేలింది. పనిలో పనిగా బయటపడిన మరో ఫలితం వారిని నిర్ఘాంతపరిచింది.

ఒత్తిడితో మృత్యువు దూరం
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు సుదీర్ఘకాలం బతికినట్లు తేలింది. ఉద్యోగం ఎంత కఠినమైనదైనప్పటికీ, లక్ష్యాలు ఏర్పరిచే అవకాశం దగ్గర్నుంచీ వాటిని సాధించే విధానం దాకా అన్నీ ఉద్యోగికి అందుబాటులో ఉన్నప్పుడు అది అతని ఆరోగ్యం మీద అనుకూల ప్రభావమే చూపుతోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఏకంగా 34 శాతం తక్కువగా ఉందట.

ఒత్తిడి ఒకోసారి బాగుంటుంది
ఒక పక్క ఒత్తిడిలో ఉండి, దానిని పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేని వ్యక్తులు... సదరు ఒత్తిడిని అధిగమించేందుకు అతిగా తినడమో, సిగిరెట్లు కాల్చడమో వంటి పనులు చేస్తుంటారట. ఇక మనసులోనే తిష్టవేసుకునే ఒత్తిడి వలన రక్తపోటు ఎలాగూ తప్పదు. అదే సమయంలో బాధ్యతలూ నీవే, హక్కులూ నీవే అన్న భరోసాని ఉద్యోగికి కల్పించినప్పుడు అతను అదే ఒత్తిడిని ఒక సవాలుగా తీసుకుంటాడు. దానిని ఎదుర్కోవడాన్ని, తద్వారా తనని తాను నిరూపించుకోవడాన్నీ ఇష్టపడతాడు.

వింటానికి బాగుంది కానీ...
‘నిర్ణయాలు తీసుకునే అధికారం’ అన్న వాక్యం వినడానికి బాగుంది కానీ... ఆ అదృష్టం ఎంతవరకూ, ఎంతమందికి లభిస్తుందన్నదే అనుమానం. ఒత్తిడి మాత్రమే ఉండి స్వేచ్ఛ లేని సందర్భాలలో దానిని ఎదుర్కొనేందుకు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం... వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ, వీటిని ఎంతమంది పాటిస్తారన్నదే అనుమానం!!!

 

- నిర్జర.

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.