ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి,  వైసీపీ సీనియర్ నాయకుడు   కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి తప్పించుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.  అదే సమయంలో వైసీపీలో తన ఇంపార్టెన్స్ తగ్గకుండా, పార్టీ క్యాడర్ తనను మరచిపోకుండా  క్రమం తప్పకుండా మీడియా ముందుకు వస్తూ.. ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో  వార్తలలో ఉంటున్నారు.  తాజాగా గుడివాడలో  కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.

 ప్రశ్న రావణ్ కేసు విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.  యూట్యూబర్ రావణ్  తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని, ఆయన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడుల కోసమే పనిచేస్తాడని ఆరోపించిన కొడాలి నాని..  ప్రశ్న రావణ్ టిడిపి నాయకులకు వ్యతిరేకంగా ఒక్కవ్యాఖ్య కూడా చేయలేదని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు.  వైసీపీ అధికారంలో  ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారంలో లేని సమయంలోనూ కూడా ప్రశ్న రావణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా.. తాము ఎప్పుడూ అతడిని అణచివేయడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు.   అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిని కొత్త చట్టాల పరిధిలోకి తెస్తూ, 'ఉప్మా', 'ఇడ్లీ' కేసులు పెడుతూ జైళ్లలో పెడుతోందంటూ సెటైర్లు వేశారు. 

అయితే నాని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం, జనసేన చెలిమిని చెడగొట్టాలన్న వ్యూహంతోనే కొడాలి నాని.. ప్రశ్న రావణ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం ఉందన్న వాదనను తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు.  అయితే జనం కొడాలి నాని కుట్ర సిద్ధాంతాన్ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి.

మిత్రపక్షమైన జనసేన అధినేతకు వ్యతిరేకంగా ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం ప్రోత్సహిస్తోందన్న నేరేటివ్ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.  అయితే వైసీపీ ఎకోసిస్టమ్ లోనే పచ్చి అబద్ధాన్ని ఎవరు నమ్మినా నమ్మకున్నా పదే పదే వల్లె వేస్తే కొందరైనా ఆ ఉచ్చులో పడకుండా ఉంటారా?  అనన భావనతో ముందుకు వెళ్లే సంస్కృతి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే కొడాలి నాని  ఇప్పుడు ప్రశ్న రావణ్ వెనుక తెలుగుదేశం అనే కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. ఇక కొంత కాలం పాటు వైసీపీ ముక్తకంఠంతో ఈ ఆరోపణలను గుప్పిస్తూనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద కొత్త కొత్త కుట్ర సిద్ధాంతాలను తెరమీదకు తీసుకురావడంలో వైసీపీలోకోడాలి నానిది ఒక ప్రత్యేక స్టైల్ అని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.  

Kodali Nani, Pawan Kalyan, Chandrababu Naidu, TDP Janasena Alliance, YouTuber Ravan Arrest

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.