పల్నాడు యుద్ధం నిజంగా జరిగిందా?? యుద్ధానికి కారణాలు ఏంటి?

Publish Date:May 23, 2022

Advertisement

భారతీయ చరిత్రలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు అన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వాటి గురించి వినడం, తెలుసుకోవడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలనాడు ప్రాంతంలో జరిగిన పల్నాడు యుద్ధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే బ్రహ్మనాయుడి పేరు కూడా ఎంతో గొప్పగా వెలిగింది. నిజంగానే పల్నాటి యుద్ధం జరిగిందా?? దానికి కారణాలు ఏంటి?? 

పల్నాటి యుద్ధం నిజంగా జరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరిగింది చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర గ్రంధాలలో కూడా పూర్తి వివరాలతో వ్రాయబడింది.

పలనాడు (ఈనాటి గుంటూరు జిల్లా ) వెలనాటిచోడుల సామంతులైన హైహయ వంశస్థులు (యాదవులు) అధీనంలో ఉండేది.పలనాటి పరిపాలకుడు 'అనుగురాజు' వెలనాటి గొంకరాజు కుమార్తె అయిన మైలాంబను వివాహం చేసుకుని తన పరపతిని పెంచుకున్నాడు. వారిద్దరికి  నలకామ/నలగామ అనే కొడుకు పుట్టాడు. అతడికి మరో ఇద్దరు భార్యలు. వాళ్ళ  పేర్లు వీరవిద్యా దేవి, భూరమదేవి.

వీరవిద్యా దేవి కొడుకులు పెద మలిదేవ, చిన మలిదేవ, బాల మలిదేవ. 

భూరమ దేవి కొడుకులు కామరాజు,నరసింగ రాజు, జత్తి రాజు, పెరుమాళ్ళు రాజు. 

అంతఃపుర కలహాలతో అనుగురాజుకి పరిస్థితి దుర్భరంగా మారింది. ఆఖరికి అనుగు రాజు హత్య చేయబడ్డాడు. అతడి మరణం తరువాత క్రీ.శ.1170లో నలగామ' పల్నాడు పాలకుడయ్యాడు. కానీ అతడు తన మంత్రియైన రేచర్ల బ్రహ్మనాయుడి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. రేచర్ల బ్రహ్మ నాయుడు వెలమ కులస్థుడు. ఆనాడు ఆంధ్ర దేశంలో వీర వైష్ణవ, వీరశైవ మతాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. బ్రహ్మ నాయుడు వీరవైష్ణవ మతావలంబి. ఆ మతాన్ననుసరించి, వేర్వేరు కులాలమధ్య బేధాలు తొలగించి, సహపంక్తి భోజనాలు, దళితులకు ఆలయప్రవేశం చేయించడం మొదలైన సామాజిక సంస్కరణలు చేపట్టాడు .నలగామకు ఇవన్నీ రుచించలేదు. అతడు తమ హైహయ వంశీకులందరి వలె శివభక్తుడు. ఈలోగా బ్రహ్మనాయుడు నలగామ సవతిసోదరులను మంచిచేసుకున్నాడు. నలగామ కి నచ్చజెప్పి పెదమలిదేవకు చిన్న సంస్థానం వంటిది ఇప్పించాడు. తరువాత బ్రహ్మనాయుడి సహాయంతో ఆ చిన్నరాజ్యం బాగా అభివృద్ధి చేసి మాచెర్ల రాజధానిగా చేసుకున్నాడు.

ఈలోగా నలగామరాజు దగ్గర నాగమ్మ అనే రెడ్డి కులానికి చెందిన స్త్రీ నాయకురాలిగా చేరింది. ఆమె శివభక్తురాలు. మాచెర్ల అభివృద్ధి చెందడం చూసి, అది చేజిక్కించుకోవడానికి నలగామ, నాగమ్మలు పధకం ప్రకారం పెదమలి దేవుడిని కోడిపందాలకి ఆహ్వానించారు. పందెంలో తన రాజ్యం ఓడిపోయాడు పెదమలిదేవుడు. అందువల్ల 7 సంవత్సరాలు రాజ్యం విడిచిపెట్టి ఏడు సంవత్సరాలయ్యాక బ్రహ్మనాయుడు రాజైన పెద మలిదేవుడికి రాజ్యం తిరిగి ఇవ్వాలని కోరాడు. కానీ నలకామ అందుకు ఒప్పుకోలేదు. ఈ కారణం వల్ల సవతి సోదరుల మధ్య యుద్ధం మొదలయింది.

క్రీ.శ.1185 లో కారెంపూడిలో నాగులేటి ఒడ్డున మహా సంగ్రామం జరిగింది. నలకామ పిలుపుకి స్పందించి కాకతీయులు, హోయసల, కోట, కాలచూరి, వెలనాటి చోడులు యుద్ధంలో పాల్గొన్నారు. మూడురోజుల్లో ముగిసిన యుద్ధంలో పెద మలిదేవుడు పక్షం ఓడిపోయింది. తనవారందరూ మరణించడంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు పలనాడుని శాశ్వతంగా విడిచిపెట్టి తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం వెలనాటి చోడులకు తమ సామంతులపై నియంత్రణ కోల్పోయారని లోకానికి వెల్లడైంది. ఈ బలహీనత గ్రహించిన కాకతీయులు 12 శతాబ్ధం చివరికల్లా కోస్తాంధ్ర ప్రాంతాన్ని కాకతీయ రాజ్యంలో భాగం చేసుకున్నారు.

ఈ యుద్ధంలో గెలిచిన,ఓడిన పక్షాల నాయకులు (ఆంధ్ర నాయకులు) కాకతీయ రాజ్యంకి వలసపోయి, కాకతీయ సైన్యంలో నాయకులుగా ప్రసిద్ధి చెందారని, వారే కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లింల దాడిని ఎదుర్కోవడానికి 'నాయక సమాఖ్య' గా ఏర్పడ్డారని చరిత్రకారుల కధనం.

ఓడిపోయిన బ్రహ్మనాయుడి పేరు అంత గొప్పగా ఎందుకు మారింది అనే సందేహం అందరికీ వస్తుంది. ఆ కాలానికే కులమతాలను పక్కనపెట్టి అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టినవాడు బ్రహ్మనాయుడు. ఆయన్ను ఒక సంఘసంస్కర్తగా చెప్పుకోవచ్చు. 

◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.