Publish Date:Jul 15, 2022
హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా సెటిలైన నరేష్ ఆ మధ్యలో రాజకీయాలలో కూడా కొంత హడావుడి చేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీ యువ నాయకుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. 2009 ఎన్నికలలో హిందూపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపికి రాజీనామా చేశారు. ఆ తరువాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చురుకుగా వ్యవహరించారు.
అక్కడా వివాదాస్పదంగా మారారు. అయితే అప్పుడెప్పుడూ రానంత పాపులారిటీ నటుడు నరేష్ కు ఇటీవలి కాలంలో వచ్చింది. అందుకు ప్రధాన కారణం ఆయనకు, పవిత్రా లోకేష్ కు ఉన్న సంబంధం, అనుబంధమే. వారిరువురి సఖ్యతపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఆ కథనాలలోని ఔచిత్యాన్ని పక్కన పెడితే.. పవిత్రా లోకేష్ తో నరేష్ అనుబంధం మాత్రం కేవలం సినీ వర్గాలలోనే కాకుండా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ పవిత్రా లోకేష్ ఎవరు? నరేష్ తో ఆమె అనుబంధం ఏమిటన్న వివరాల్లోకి వెళితే. కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన పవిత్ర లోకేశ్ తండ్రి కన్నడ నటుడు లోకేష్. ఆయన పవిత్ర లోకేష్ చిన్నతనంలోనే మరణించారు. దీంతో పవిత్ర లోకేష్ తండ్రి సినీవారసత్వాన్ని కొనసాగించారు.
ఒక వైపు నటిస్తూనే శ్రద్ధగా చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఆ తరువాత సీనిమాలనే కెరీర్ గా ఎంచుకున్నారు. కన్నడ నాట హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు. కన్నడలో హీరోయిన్ గా అయితేనేం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితేనేం దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. పలు అవార్డులు సైతం అందుకున్నారు.
ఆమె భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా కన్నడ నటుడే. అయితే సుచీంద్ర ప్రసాద్ కంటే ముందు ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం అయ్యింది. ఆ తరువాత ఆయనతో విడాకులు తీసుకుని కన్నడ నటుడు సుచీంద్ర ప్రసాద్ లో సహజీవనం చేశారు. 2018 లో ఆయన నుంచి విడిపోయారు. కాగా ఆ తరువాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తొలుత రవితేజ హీరోగా నటించిన దొంగోడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పవిత్రా లోకేష్ ఆ తరువాత తెలుగు సినిమాలలో తల్లి, అత్త వంటి క్యారెక్టర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
ఈ క్రమంలోనే నటుడు లోకేష్ కు దగ్గరయ్యారు. వీరిరువురూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/story-behind-naresh-and-pavitra-bond-39-139810.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.