Publish Date:Apr 26, 2022
ఉక్కు సెగ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఉక్కు సంకల్పం విశాఖపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అదే సంకల్పం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఉక్కు దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరగక తప్పదన్న సంకేతం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికలలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. విపక్ష టీడీపీకి తీపి గెలుపు అందింది. నిజానికి ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. కేవలం మద్దతే కాదు..ఈ ఎన్నికలలో ఐఎన్టీయూసీ తరఫున...వైసీపీ నేతే పోటీలో దిగి పరాజయం పాలయ్యారు.
అయితే ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ పోటీ చేయకపోవడానికి కారణం కార్మికులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతే కారణమి పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎన్నికల ఫలితం కేవలం ఉక్కు కర్మాగారానికే పరిమితం కాదనీ, అది విశాఖ నగరంలో అధికార పార్టీ వ్యతిరేకతకు అద్దం పడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కేవలం విశాఖ నగరానికే కాక ఉక్కు జ్వాలలు రాష్ట్ర మంతటా వ్యాపించే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువాడు నినదించి ఆందోళనలతో రగిలి వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా ఆపడానికి ఇసుమంతైన ప్రయత్నించని వైసీపీ సర్కార్ పై ఉక్కు కార్మికుల్లోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు అది ఆంధ్రుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను వైసీపా పట్టించుకోని ఫలితమే వైజాగ్ స్టీల్ ఎన్నికల్లో ఓటమి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో తెలుగుదేశం అనుబంధ యూనియన్ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ దాదాపు 466 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
ఈ మూడేళ్లలో వైసీపీకి ఏదైనా ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు సెగ వైసీపీని మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. ఈ అంచనాకూ కారణం లేకపోలేదు. ఒక కర్మాగారం కార్మిక సంఘం ఎన్నికలే అయినా...ఈ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిలో జరిగింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి గేట్ మీటింగులకు కూడా హాజరై ప్రచారం నిర్వహించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా వైసీపీ తాను మద్దతు పలికిన యూనియన్ ను గెలిపించుకోలేకపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/steel-plant-privitisation-heat-defeats-ycp-25-134996.html
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.