వెండితెరకెక్కనున్న దార్శనికుడి కథ.. చంద్రబాబు బయోపిక్‌కు రంగం సిద్ధం!

Publish Date:Apr 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన అగ్రనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన ప్రయాణాన్ని బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో రాజధాని ఫైల్స్ వంటి సెన్సేషనల్ మూవీతో అమరావతి రైతుల ఆవేదనను, రాజధాని ఆవశ్యకతను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భాను చంద్రబాబు బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాయి. చంద్రబాబు నాయుడు జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన సాగించిన పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు భాను సిద్ధమవుతున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. 

 చంద్రబాబు నాయుడు ప్రస్థానం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని చంద్రబాబు బయోపిక్ దర్శకుడు భాను పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రజాక్షేమం, ప్రతి ఆలోచన వెనుక భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఆయన.. నిత్యకృషివలుడైన నాయకుడి జీవితంలో ఉండే ఉద్వేగాలు, సంఘర్షణలు,  విజయాలను ఈ బయోపిక్ ద్వారా ప్రపం కళ్లకు కట్టనున్నట్లు చెప్పారు.  నిఘంటువులోని ప్రతి పదానికి అర్థం ఉన్నట్లే, ఆయన వేసిన ప్రతి అడుగులో ఒక గొప్ప చరిత్ర ఉందని భాను అన్నారు. 

ఈ చిత్రాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా  పాన్ వరల్డ్' రేంజ్ లో  నిర్మించేందుకు  ప్లాన్ చేస్తున్నారు. వివిధ దేశాల్లోనూ చంద్రబాబుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేసే యోచనలో ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ మూవీని తీర్చిదిద్దాలని చిత్ర బృందం కంకణం కట్టుకుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ  సాగుతోంది. భారీ తారాగణంతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు. చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  రాజకీయ బయోపిక్‌లు టాలీవుడ్‌లో కొత్త కాకపోయినా, చంద్రబాబు వంటి సమకాలీన రాజకీయ దిగ్గజం కథను భాను వంటి   దర్శకుడు హ్యాండిల్ చేయడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.  రాజధాని ఫైల్స్ చిత్రంలో అమరాతి రైతుల బాధలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన దర్శకుడు భాను.. చంద్రబాబు బయోపిక్ ను మరింత ప్రతిభావంతంగా, ప్రభావమంతంగా చూపుతారన్న అంచనాలు ఉన్నాయి.  చంద్రబాబు బయోపిక్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By
en-us Political News

  
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
నాదెండ్ల భాస్కరరావు ఆత్మకథ వాకింగ్ విత్ డెస్టినీ అన్న పుస్తకంలో అసలు ఏముంది?
భారత తలసరి ఆదాయం ఇప్పటికీ చైనా తలసరి ఆదాయంలో ఐదో వంతు మాత్రమే కావడంతో ఉత్పాదకత పెరుగుదలకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయ వృద్ధికి కావలసినంత స్పేస్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక పురోగతి మరింత వేగం పుంజుకోవడానికి ఇండియాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొన్న ట్రంప్.. నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు అసౌకర్యాన్ని తగ్గించే ఉద్దేశంతో మెట్రో రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు.
విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.