కరుణ వీర రస సమన్వయం శ్రీరామ తత్వం

Publish Date:Mar 31, 2023

Advertisement

శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి - ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు తాత్త్విక దృష్టి.ఈ మూడింటి భావాలతో శ్రీరాముని అవతార కార్యం నడిచింది.  మానవ జీవన సరళిని మహోన్నతంగా మలచే 'ధార్మికత', మంత్రమయ భక్తి భావనతో పునీతులను చేసే 'ఉపాసనారీతి', పరమార్ధ తత్త్వాన్ని పట్టిచ్చే 'తాత్త్వికత'లు శ్రీరామునిలో మూర్తీభవించాయి.

రమణీయమైన ఒక దివ్యత్వం రాముడై, లోకాలకు "భద్రా"న్ని (క్షేమాన్ని) కలిగించడం చేత “రామభద్రు"డై, ప్రసన్న గుణాలతో ఆనందశాంతులను అందించడంచేత “రామ చంద్రు”డై పరిపూర్ణతత్త్వం “రామ, రామభద్ర, రామచంద్ర" స్వరూపమయ్యింది.  వ్యక్తి సాధించవలసిన అనేక ధర్మాల్లో ఒక్కొక్క సందర్భంలో పరస్పర ఘర్షణ ఏర్పడుతుంది. ఒక ధర్మాన్ని నిలిపేటప్పుడు, మరో ధర్మం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఒకదాన్ని మరోదానితో ఎలా సమన్వయించాలి, దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలి? అనేది 'సూక్ష్మధర్మం'. అది తెలియడమే ధర్మసూక్ష్మం.ఆ సూక్ష్మజ్ఞానమే రాముడి వ్యక్తిత్వం. 

పాలనా ధర్మరక్షణ, వ్యక్తిగత కుటుంబ ధర్మనిర్వహణ... రెండింటికీ పొంతన కుదరనప్పుడు దేనికీ విఘాతం కలగకుండా కాపాడిన రాముడు... దశరథ రామునిగా, సీతా రామునిగా, అయోధ్య రామునిగా విజయశీల వ్యక్తిత్వాన్ని ప్రతిష్ఠించాడు.  శ్రీరాముడు కౌమారదశనుండే తన రక్షణ స్వభావాన్ని ప్రకటించాడు. అధర్మాన్ని శిక్షించడంలో కాఠిన్యం, ధర్మ రక్షణలో కారుణ్యం...  ఈ రెండింటి పొందిక శ్రీరాముడిలోని కరుణ వీర రస సమన్వయం. ప్రసన్న, ప్రతాపమూర్తిమత్వం.  యువరాజయ్యే అర్హత కలిగిన వయస్సులోనే శ్రీరాముని దివ్యగుణాలకు అయోధ్య వాసులు ఆకర్షితులుయ్యారు. ఆరాధించారు. ఆ దశలోనే రామచంద్రుడు వారి బాగోగులను గమనించడం, తండ్రి తనయులను ఆదరించినట్లుగా మన్నించడం... ఇవన్నీ ఉత్తమ పాలక స్వభావాలను స్పష్టం చేశాయి. ఒకవైపు పూర్వీకులనుండి అనుసరిస్తున్న పటిష్టమైన ధర్మపరంపరకు రాముని ప్రత్యేకత తోడయ్యింది.  ముఖ్యంగా రామకథను పరిశీలిస్తుంటే అయోధ్యతో రామునకు, రామునితో అయోధ్యకు ఉన్న ప్రగాఢాత్మీయబంధం సుందరంగా గోచరిస్తుంది. 

బాల్యం నుండి రాముని పట్ల అయోధ్యకు ప్రేమ. యుక్తవయసు రాగానే వ్యవహారంగా దశరథుడు పాలకుడైనా, ప్రజల మనసుకు మాత్రం రాముడే ప్రభువు. అది గమనించే దశరథుడు యువరాజ పట్టాభిషేకానికి నిర్ణయించుకున్నాడు.  జగద్రక్షణకై, వనవాసం నెపంతో రాముడు రాజ్యాన్ని త్యజించాడు. ఆ సమయంలో అయోధ్య కన్నీరు మున్నీరయ్యింది. రాముని వదలలేక అయోధ్యలో అనేక మంది ఆయన వెంటవెళ్లారు. వెళ్లే అవకాశం లేనివారు కేవలం శరీరాలే అక్కడ మిగిలినట్లయ్యారు. చిత్రమేమిటంటే - అయోధ్యలోని మానవులే కాదు పశు పక్ష్యాదులు, వృక్షలతాదులు కూడా దుఃఖించాయట.

 "దూడలు పాలు తాగడం లేదు. అవి పాలు తాగలేదని కూడా గోవులు గమనించలేదు. అప్పుడే తొలి బిడ్డను ప్రసవించిన తల్లి, తన ప్రథమ మాతృత్వపు మాధుర్యాన్ని కూడా అనుభవించడం లేదు. అన్నం పెట్టమని పిల్లలు అడగడం లేదు. తినమని పెద్దలు చెప్పడం లేదు" అని వర్ణించాడు వాల్మీకి. రామునితో వెళ్ళిన వారిని కూడా, రాముడు విడిచి వెళ్ళాక, వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు. వెనక్కివచ్చిన వారితో ఇంటి వారంతా "రాముని వదలి, రాముడులేని రాజ్యంలో ఏం సాధిద్దామని వచ్చారు?" అని వాపోయారు.   “అయోధ్యలో చరితార్థుడైన సత్పురుషుడు లక్ష్మణుడు మాత్రమే. అతడొక్కడే రామునితో వెళ్లాడు. రాముని వదలనివారే సత్పురుషులు” అని తీర్మానించుకున్నారు. 

బీడుపడ్డట్టుగా అయింది అయోధ్య.  శ్రీరాముని తిరిగి అయోధ్యకు రప్పించి రాజ్యాన్ని అప్పగించాలనుకున్న తన ప్రయత్నాలు వ్యర్థమయ్యాక, పాదుకలు తీసుకుని అయోధ్యకు చేరాడు భరతుడు. కానీ రాముని తప్ప ఏ ఒక్కరినీ ప్రభువుగా అంగీకరించలేని అయోధ్య, శ్మశానసదృశంగా గోచరించడంతో, భరతుడు అయోధ్యను వీడి నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం చేశాడు.
అక్కడినుంచే అయోధ్యను పాలించాడు. తిరిగి రాముడు వచ్చాకే అయోధ్యకు కళ వచ్చింది. రాముని పాలనలో అయోధ్య ధర్మరాజ్యం మాత్రమే కాక, 'రామ ప్రేమ రాజ్య'మయ్యింది. రామభక్తి సామ్రాజ్యమయ్యింది.  వ్రేపల్లే వాసుల కృష్ణ ప్రేమకు, అయోధ్యవాసుల రామప్రేమ ఏ మాత్రం తీసిపోదు.   రామపాలనలో జనులంతా రామమయులయ్యారు. “రామ భూతం జగద భూత్"... అంటాడు వాల్మీకి. అయోధ్య ప్రజలకు “అంతా రామమయ”మయింది. వారి మాటల్లో తొంభై తొమ్మిది శాతం రామనామమే. రాముని కబుర్లే.

"నిరంతరం రాము దర్శిస్తూ, ప్రజల్లో హింసాప్రవృత్తి నశించింది” అనే అద్భుతమైన మాటను పలికాడు వాల్మీకి.రామచరిత్ర, వ్యక్తిత్వం నిత్యస్మరణగా కలిగిన వారి హృదయంలో హింసా భావనలు, వ్యతిరేక ధోరణులు నశిస్తాయని ఆ ఆదికవి ఉద్దేశం. ఈ ప్రగాఢ ప్రేమబంధం ఫలితంగానే అవతార పరి సమాప్తివేళ, వారందరినీ తనతో పాటుగా పరంధామంలో ప్రవేశింపజేశాడని రామాయణం, ఇతర పురాణాలు పేర్కొన్నాయి. 

'అయోధ్య' అంటేనే 'ఇతరులు (శత్రువులు) దెబ్బ తీయలేనిచోటు' అని అర్థం. సాకేతం- అంటే 'జ్ఞానస్థలం' అని ప్రధానార్థం. శ్రీరామచంద్రమూర్తి ఏ హృదయంలో ఉంటాడో వారి జీవితమే రామభక్తి సామ్రాజ్యం.  ఆ మానసంలో దుర్గుణాలనే అంతశ్శత్రువులు ప్రవేశించ లేవు. కనుక అదే 'అయోధ్య'. అది జ్ఞానమయస్థానం కనుక అదే 'సాకేతం'.   అందుకే రామభక్తులు 'రాముని వారము మాకేమి విచారము' (రామదాసు) అని ధీమాగా పలుకుతారు. 'తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు' అని నిర్భయంగా కీర్తిస్తారు. 

By
en-us Political News

  
పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది. భావ ప్రకాశ వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు
అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.
పురాణ ఇతి హాస లలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధమ్ వేసేప్పుడు తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ  బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేసినట్లు అర్థం చేసుకోవాలి . గర్భ గుడి గడపలో నాగ బంధం ఉన్నట్లు దేవాలయం వారసులు ఇటీవలి కాలంలో గుర్తించారు
పాండవుల తరువాత భారతదేశాన్ని ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మహారాజు పరీక్షిత్తు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొన్నాడు. ఇతని కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకు మరణం గూర్చి ముందే తెలుసు. ప్రతీవారికి మరణం గూర్చి తెలియాలనే ఉద్దేశ్యంతో పరీక్షిత్తు శుక మహర్షిని ప్రశ్న అడిగాడు.జ్ఞానోదయానికే శుక మహర్షి అంతే ఓపికగా సమాధానం చెబుతాడు.
శ్రీకృష్ణుణ్ని జీవితంలో ముఖ్య ఘట్టాలు దశమస్కందంలో సోదాహరణంగా వివరించారు. పోతన భాగవతంలో దశమస్కందానికి విశేష ప్రాధాన్యత ఉంది. భాగవతంలో ఆయువుపట్టు దశమస్కంధం. దాన్ని పూర్వోత్తర భాగాల పేరిట రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కల్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కల్యాణానికి ఉన్న విశేష ప్రాధాన్యమే అందుకు కారణం. ఈ ఘట్టం చదివినా, విన్నా కలిగే ఫలితం ‘ఇది’ అని చెప్పడానికి మాటలు చాలవు. ఇందులో పాఠకులకు లౌకిక, వేదాంతపరమైన రెండు అర్థాలు గోచరమవుతాయి. ప్రేమ, అనురాగం, మమకారం, ఆదరణ లాంటి సున్నిత విషయాలు అంతర్గతంగా ఉన్నాయి.తన జీవన సహచరుడు ఎలా ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకునే శక్తి స్త్రీలకే ఉంటుందని దమయంతి వంటి అనేక పురాణ పాత్రల వల్ల తేటతెల్లమవుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో మొగమాటాన్ని కాస్త సడలించి, తెగింపు జోడిస్తే ఆశించిన విజయాలు కలుగుతాయని ఆ వనితలు నిరూపించారు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో పై విషయాలు మరింత స్పష్టంగా గోచరమవుతాయి.రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ని వలచింది. ఆ వలపును పండించుకోవడానికి ఆమె చూపిన తెగువ అన్ని కాలాల ప్రేమికులకూ ఆదర్శప్రాయం. త్వరగా నిర్ణయం తీసుకోవడం, అంతలోనే ఒక నిశ్చయానికి రావడం, వచ్చిన వెంటనే అమలు పరచకుండా ‘ఎందుకైనా మంచిది’ అంటూ మళ్ళీ మరోసారి ముందు వెనకలుగా ఆలోచించడం పురుషుడి లక్షణం. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్త్రీల లక్షణం. ఒక పట్టాన నిర్ణయానికి రారు. వచ్చిన తరవాత వెనుతిరిగి చూడరు. వారు తీసుకునే నిర్ణయంలోని గాఢత, స్పష్టత అలాంటిది.ఆ ఘట్టంలో ఆమె కృష్ణుడికి పంపిన సందేశంలో ‘ముకుందా! గుణవతి, స్థిరచిత్త అయిన ఏ స్త్రీ అయినా గుణం, రూపం, శీలం, విద్య, వయసు, ధనం, తేజస్సుల చేత శ్రేష్ఠుడైనవాడినే భర్తగా కోరుకుంటుంది. అందులో నీకు నీవే సాటి అయిన నిన్ను తప్ప ఇతరులను నేను కోరుకోకపోవడంలో తప్పులేదని నా భావన’ అని పేర్కొంది.  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.
అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు. కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం.
Publish Date:Apr 7, 2023
ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన బొమ్మను గీయించాలని ఎందుకో ఆలోచన వచ్చింది.
ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు . రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.
రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకునే శుభ తరుణం శ్రీరామనవమి. శ్రీరామ నవమి రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు.
Publish Date:Mar 27, 2023
ఏ మానవుడికైనా ఆనందంగా జీవించడమే. అలా భావించడం లక్ష్యం. అయితే అందుకోసం మానవుడు బాహ్యప్రపంచంలో వస్తువులలో దేహేంద్రియాలలో వెతుకుతున్నాడు. తాత్కాలిక సుఖాలు, సంపదలతోనే అనందం ఉందన్న భ్రాంతిలో బతికేస్తున్నాడు. అవే శాశ్వతం అనుకుంటున్నాడు.
ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ వుండేటోడు. కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు.
సంస్కారమే మనిషి తనానికి నిదర్శనం. ఎదుటి వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వడమే ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రమాణికంగా ఎవరైనా భావిస్తారు. అలా మన సంస్కారాన్ని చాటేందుకు మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం నిదర్శనంగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.