మంచి వాడికి అంతా మంచే..!

Publish Date:Mar 25, 2023

Advertisement

ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ వుండేటోడు. కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు. అందుకే అందరికీ ఆ రైతంటే చానా ఇష్టం. సొంత బంధువులెక్క చూసుకునేటోళ్ళు. రైతు పెండ్లాం గూడా చానా మంచిది. మొగుడు చేసే పనికి సాయం చేయడమే తప్ప ఏనాడూ ఎదురు మాట్లాడిందీ లేదు, చెయ్యనని వెనక్కి తిరిగిందీ లేదు. ఆ రైతుండే వూరి పేరు జొన్నగిరి. దాని అసలు పేరు సువర్ణగిరి అని, ఒకప్పుడు అశోకుని పాలనలో రెండవ రాజధానిగా ఒక వెలుగు వెలిగిందని చానామంది పండితులంటారు.

ఆ వూరిలో వజ్రాలు దొరుకుతాయని పెద్ద పేరు. దాంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఆశగా ఆ వూరి చుట్టుపక్కల వున్న పొలాల్లో, కొండల్లో నిరంతరం తవ్వుతా వెదుకుతా వుంటారు. అనేకమందికి చానా విలువైన వజ్రాలు ఎన్నోసార్లు దొరికినాయి. రాత్రికి రాత్రి ధనవంతులైనవారు ఎందరో. ఒకసారి ఆ పేదరైతు పొలానికి పోయి దాన్ని దున్నుతా బాగా అలసి పోయినాడు. దాహం అవుతావుంటే తాగుదామని చెంబు పైకెత్తినాడు. అంతలో ఒక్కసారిగా సర్రుమని గాలి పైకి లేచి, దుమ్ము రైతు కంట్లో పడింది. దాంతో చేతిలోని చెంబు జారి కిందపడి నీళ్ళన్నీ పొలంలో ఒలికిపోయినాయి. రైతు కల్ళు నులుముకుంటూ ఆ చెంబును తీసుకోవడానికి కిందికి వంగినాడు. ఆ నీళ్ళు యాడైతే పడినాయో ఆడ ఏదో తళుక్కుమని మెరిసింది. ఏమబ్బా మెరుస్తావుంది అని పరీక్షగా వంగి చూస్తే.... ఇంగేముంది చానా చానా విలువైన చిన్న వజ్రం నక్షత్రం లెక్క ధగధగా మెరిసిపోతా కనబడింది. నీళ్ళు పడి అంతవరకూ దానిమీదున్న మట్టంతా తొంగిపోయింది. రైతు ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకొని ''ఆహా... ఎంత అదృష్టం. చూడ్డానికి చిన్నగా వున్నా లోపల ఒక్క మచ్చగూడా లేకుండా తళతళతళ మెరిసిపోతావుంది. ఈ వజ్రం అమ్మి ఇంకొంచం పొలం కొనుక్కుంటే ఇకపై జీవితమంతా ఎటువంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకొచ్చు అనుకున్నాడు.

సంబరంగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకోనొచ్చి పెండ్లానికి చూపిచ్చినాడు. అమె దాన్ని ముట్టుకోని, ముట్టుకోని మురిసిపోయింది. ఈ విషయం వూరంతా ఒక్కసారిగా గుప్పుమనింది. ఆ రైతు చానా మంచోడు కావడంతో అందరూ సంతోషపడ్డారే గానీ ఎవ్వరూ అసూయ పడలేదు. ''నీ మంచితనమే నీకు మేలు చేసింది. నీవు పాటించిన ధర్మమే నీకు వజ్రాన్ని దొరికేలా చేసింది'' అని మెచ్చుకున్నారు. ఆ రైతు పక్కవూరి వజ్రాల వ్యాపారికి తరువాత రోజు వచ్చి దానికి సరియైన ధర చెల్లించి తీసుకుపొమ్మని కబురు పంపినాడు. ఆ రాత్రి దాన్ని భద్రంగా ఒక గూట్లో పెట్టి హాయిగా నిదురపోయినాడు. ఆ ఇంటిలో ఒక పెద్ద ఎలుక వుంది. అది చీకటి పడగానే రైతు ఇంటిలోనికి పోయి గింజలు, మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తింటావుండేది. ఎప్పట్లాగే అది ఆ రోజు రాత్రిగూడా ఆహారం కోసం ఇండ్లంతా వెదుకుతా వుంటే దానికి గూట్లో ధగధగా మురిసిపోతావున్న వజ్రం కనబడింది. ఇదేందబ్బా... కొత్తగా వుంది. ఎప్పుడూ చూల్లేదే ఇటువంటి గింజ అని నోటితో పట్టుకోని కొరకసాగింది. అట్లా కొరుకుతావుంటే అది లటుక్కున జారి దాని గొంతులో ఇరుక్కోనింది. అటూ బైటికీ రాక, ఇటు లోపలికీ పోక గిజగిజలాడతా కిందామీదా పడి పొర్లసాగింది. ఆ చప్పుడుకి పొదలో పడుకున్న ఒక పాము పైకి లేచి దాన్ని చూసింది. ''ఆహా... బాగా లావుగా కొవ్వు పట్టి నిగనిగలాడతావుంది. ఎన్నాళ్ళకు దొరికింది ఇంత మంచి ఆహారం. ఈ రోజు దీన్ని పట్టుకోని పండగ చేసుకోవచ్చు' అనుకొని నెమ్మదిగా పొదలమాటున దాచిపెట్టుకుంటా... దాచి పెట్టుకుంటా ఆ ఎలుక దగ్గరికి వచ్చింది. ఎలుక వజ్రం గొంతులో ఇరుక్కోని తనకలాడతా వుంది గదా.... అది పాముని గమనించలేదు. అంతే... ఇంకేముంది పాము ఆ ఎలుకని లటుక్కున పట్టుకోని గుటుక్కున మింగేసింది.

అట్లా ఆ వజ్రం ఎలుకతో బాటు పాము నోటిలోకి వెళ్ళిపోయింది. పాము ఎలుకను మింగి సంబరంగా ఒక చెట్టుకింద పొదలో హాయిగా చుట్టచుట్టుకొని పడుకుంది. ఆ చెట్టుపైన ఒక పెద్ద గద్ద వుంది. దానికి ముందురోజునుంచీ తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో ఆకలితో అల్లాడిపోతావుంది. చెట్టుపైన కూచోని చుట్టూ చూడసాగింది. దానికి పొదలో పడుకున్న ఈ పాము కనబడింది. 'ఆహా... దొరికిందిరా మంచి పసందైన విందు భోజనం' అనుకుంటూ ఆ గద్ద సర్రున దూసుకోనొచ్చి ఆ పాముని తన వాడిగోళ్ళతో పట్టుకోని ఒక్కసారిగా పైకెగిరింది. పాము అదిరిపడి నిద్రలేచేలోగా తన వాడియైన ముక్కుతో పొడిచి చంపేసింది. ఒక చెరువు పక్కన పెద్ద చెట్టుంటే దానిమీద వాలి తినసాగింది. అట్లా తింటావుంటే మధ్యలో ఈ వజ్రం వచ్చింది. అది ధగధగా మెరుస్తావుంటే తినేదో, కాదో అర్థంగాక ముక్కుతో టపటపా కొట్టి చూసింది. అది బాగా గట్టిగా వుండడంతో పనికిరానిదని కింద వున్న చెరువులో పడేసింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద చేప వచ్చింది. ఆ వజ్రం సరిగ్గా దాని నోటిలో పడింది. అంతే... అది దానిని గుటుక్కున మింగేసింది.

ఆ తరువాత రోజు ఆదివారం. ఆదివారమంటే చానామంది కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు తింటా వుంటారు గదా. దాంతో వాటికి బాగా గిరాకీ వుంటుంది. అందుకని జాలరులు చేపలు పట్టడానికని చెరువులోకి వలలు విసిరినారు. ఒకని వలలో ఈ పెద్ద చేప చిక్కుకోనింది. 'ఆహా... ఎంతదృష్టం. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చినట్టున్నా. అందుకే ఇంత పెద్ద చేప దొరికింది'' అనుకోని వాడు సంబరంగా దొరికిన చేపలు గంపలో ఏసుకోని అమ్ముకోడానికి వూర్లోకి వచ్చినాడు. రైతు పెండ్లాం ఆ రోజు పొద్దున్నే లేచింది. మొగుడు చానా రోజులనుంచీ 'చేపలకూర చెయ్యే ఒక్క రోజైనా' అంటా వున్నాడు. దుడ్లు లేక రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ఒక్కొక్క రోజే దాటేస్తావుంది. నిన్ననే కూలీ డబ్బులు చేతికి వచ్చినాయి. దానికి తోడు వజ్రం దొరికింది గదా... ఆ సంబరమూ తోడైంది. దాంతో మొగునికి మంచిగా చేపలకూర చేసి పెడదామని ఇంటిముందు నిలబడి ఎదురు చూస్తావుంది. వాళ్ళ పక్కింట్లో బాగా డబ్బున్న కుటుంబం వుంది. ఆమె గూడా పొద్దున్నే లేచి మొగునికి చేపలకూర చేసి పెడదామని తలుపుకాడ నిలబడి పదురు చూస్తావుంది. అంతలో చేపలమ్మేటోడు ఆ వీధిలోకి వచ్చినాడు. ఇద్దరూ వాన్ని పిలిచినారు. పెద్ద చేప చానా ఖరీదు గదా... దాంతో పక్కింటామె కొనుక్కోనింది. రైతు పెండ్లాం చిన్న చేపను కొనుక్కోనింది. పొద్దున్నే రైతు లేచి సంబరంగా చూస్తే ఇంకేముంది వజ్రం గూట్లో కనబల్లేదు. అది ఎక్కడైనా పడిపోయిందేమోనని మొగుడూ పెళ్ళాలు కలసి ఇండ్లంతా కిందికీ మీదికీ వెదికినారు. కానీ అసలుంటే గదా దొరికేది. పాపం... వెదికీ వెదికీ అలసిపోయినారు. పాపం ఆమె కండ్లనుండి సర్రున నీళ్ళు కారినాయి. ''అదృష్టం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయిందే'' అని తెగ బాధపడింది. అది చూసి ఆ రైతు ''మనం కష్టపడి సంపాదిచ్చినదైతే పోయినందుకు బాధ పడాలిగానీ వూరికే వచ్చిందానికి బాధ ఎందుకు. అసలు దొరకలేదు అనుకుంటే సరి'' అన్నాడు చిరునవ్వుతో పెండ్లాన్ని ఓదారుస్తూ. అంతలో వాళ్ళింటి తలుపు ఎవరో తట్టినారు. ఎవరబ్బా అని పోయి చూస్తే ఇంకేముంది నగరం నుండి వచ్చిన వజ్రాల వ్యాపారస్తులు. రైతు వజ్రం అమ్ముతానని కబురు పంపినాడు గదా దాంతో కొనడానికని వచ్చినారు. రైతు వాళ్ళకి జరిగిందంతా చెప్పి ''జరిగిందేదో జరిగిపోయింది. ఎట్లాగూ ఇంత దూరం వచ్చినారు గదా. మరలా వెంటనే ఏం వెళతారు గానీ కాసేపు విశ్రాంతి తీసుకోండి. వేడి వేడి చేపలకూర తిని పోదురుగానీ... నా పెండ్లాం చేతివంట అచ్చం పుల్లారెడ్డి నేతిమిఠాయి లెక్క కమ్మగుంటాది'' అన్నాడు. వాళ్ళు సరే అన్నారు.

రైతు పెండ్లాంతో ''ఏమే... పొద్దున్నే మనకోసం మాంచి చేపలు కొన్నావు గదా... పాపం వాళ్ళు చానాదూరం నుంచి వచ్చినారు. ఎప్పుడు తిన్నారో ఏమో... తొందరగా జొన్నరొట్టె చేపలపులుసు చెయ్‌'' అన్నాడు. ఆమె సరేనని పెరట్లో కూర్చోని చేపల పొలుసులు తీసి శుభ్రం చేస్తావుంటే పక్కింటామె వచ్చి ''అక్కా.... అనుకోకుండా మా దగ్గరి బంధువుల్లో ఒకాయనకు ఆరోగ్యం బాగాలేదని, ఆఖరిచూపు చూడ్డానికి క్షణం గూడా ఆలస్యం చేయకుండా వున్నఫలానా వచ్చేయమని కబురొచ్చింది. అందుకే ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వెంటనే వెళ్ళి పోతావున్నాం. పొద్దున్నే నీతోబాటు ఒక పెద్ద చేప కొన్నా గదా... అది తీసుకో. దానిమీద మీ పేర్లే రాసిపెట్టినట్టున్నాయి. మీరన్నా హాయిగా కడుపునిండా తినండి'' అంటూ ఆ చేపను తీసుకోనొచ్చి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రైతు పెండ్లాం సంబరంగా ఆ చేపను గూడా బాగా కడిగి కత్తిపీటతో మధ్యకు కోసింది. అంతే... ఇంకేముంది దాని కడుపులో పొద్దున పోగొట్టుకున్న వజ్రం తళతళతళ మెరుస్తా కనబడింది. అది చూసి ఆమె సంబరంగా కప్పెగిరిపోయేటట్టు కెవ్వున కేక పెట్టింది. ఆ అరుపుకు అదిరిపడి ఇంట్లోవున్న అందరూ పరుగెత్తుకొని అక్కడికి వచ్చినారు. గూట్లో పెట్టిన వజ్రం చేప కడుపులోకెట్లా పోయిందో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. వజ్రాల వ్యాపారస్తులు దాన్ని చూసి ''నీ మంచితనమే మరలా వజ్రాన్ని నీ దగ్గరికి చేర్చింది. ఇట్లాంటి విచిత్రాన్ని, నీలాంటి అదృష్టవంతున్ని ఈ లోకంలో మేమెప్పుడూ చూడలేదు'' అంటూ బాగా మెచ్చుకున్నారు.

By
en-us Political News

  
పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది. భావ ప్రకాశ వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు
అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.
పురాణ ఇతి హాస లలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధమ్ వేసేప్పుడు తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ  బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేసినట్లు అర్థం చేసుకోవాలి . గర్భ గుడి గడపలో నాగ బంధం ఉన్నట్లు దేవాలయం వారసులు ఇటీవలి కాలంలో గుర్తించారు
పాండవుల తరువాత భారతదేశాన్ని ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మహారాజు పరీక్షిత్తు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొన్నాడు. ఇతని కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకు మరణం గూర్చి ముందే తెలుసు. ప్రతీవారికి మరణం గూర్చి తెలియాలనే ఉద్దేశ్యంతో పరీక్షిత్తు శుక మహర్షిని ప్రశ్న అడిగాడు.జ్ఞానోదయానికే శుక మహర్షి అంతే ఓపికగా సమాధానం చెబుతాడు.
శ్రీకృష్ణుణ్ని జీవితంలో ముఖ్య ఘట్టాలు దశమస్కందంలో సోదాహరణంగా వివరించారు. పోతన భాగవతంలో దశమస్కందానికి విశేష ప్రాధాన్యత ఉంది. భాగవతంలో ఆయువుపట్టు దశమస్కంధం. దాన్ని పూర్వోత్తర భాగాల పేరిట రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కల్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కల్యాణానికి ఉన్న విశేష ప్రాధాన్యమే అందుకు కారణం. ఈ ఘట్టం చదివినా, విన్నా కలిగే ఫలితం ‘ఇది’ అని చెప్పడానికి మాటలు చాలవు. ఇందులో పాఠకులకు లౌకిక, వేదాంతపరమైన రెండు అర్థాలు గోచరమవుతాయి. ప్రేమ, అనురాగం, మమకారం, ఆదరణ లాంటి సున్నిత విషయాలు అంతర్గతంగా ఉన్నాయి.తన జీవన సహచరుడు ఎలా ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకునే శక్తి స్త్రీలకే ఉంటుందని దమయంతి వంటి అనేక పురాణ పాత్రల వల్ల తేటతెల్లమవుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో మొగమాటాన్ని కాస్త సడలించి, తెగింపు జోడిస్తే ఆశించిన విజయాలు కలుగుతాయని ఆ వనితలు నిరూపించారు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో పై విషయాలు మరింత స్పష్టంగా గోచరమవుతాయి.రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ని వలచింది. ఆ వలపును పండించుకోవడానికి ఆమె చూపిన తెగువ అన్ని కాలాల ప్రేమికులకూ ఆదర్శప్రాయం. త్వరగా నిర్ణయం తీసుకోవడం, అంతలోనే ఒక నిశ్చయానికి రావడం, వచ్చిన వెంటనే అమలు పరచకుండా ‘ఎందుకైనా మంచిది’ అంటూ మళ్ళీ మరోసారి ముందు వెనకలుగా ఆలోచించడం పురుషుడి లక్షణం. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్త్రీల లక్షణం. ఒక పట్టాన నిర్ణయానికి రారు. వచ్చిన తరవాత వెనుతిరిగి చూడరు. వారు తీసుకునే నిర్ణయంలోని గాఢత, స్పష్టత అలాంటిది.ఆ ఘట్టంలో ఆమె కృష్ణుడికి పంపిన సందేశంలో ‘ముకుందా! గుణవతి, స్థిరచిత్త అయిన ఏ స్త్రీ అయినా గుణం, రూపం, శీలం, విద్య, వయసు, ధనం, తేజస్సుల చేత శ్రేష్ఠుడైనవాడినే భర్తగా కోరుకుంటుంది. అందులో నీకు నీవే సాటి అయిన నిన్ను తప్ప ఇతరులను నేను కోరుకోకపోవడంలో తప్పులేదని నా భావన’ అని పేర్కొంది.  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.
అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు. కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం.
Publish Date:Apr 7, 2023
ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన బొమ్మను గీయించాలని ఎందుకో ఆలోచన వచ్చింది.
ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు . రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.
రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకునే శుభ తరుణం శ్రీరామనవమి. శ్రీరామ నవమి రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు.
శ్రీరామకథను మూడు దృక్కోణాలతో దర్శించి, ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ఒకటి - ధార్మిక దృష్టి, రెండు- ఉపాసనాదృష్టి, మూడు తాత్త్విక దృష్టి.
Publish Date:Mar 27, 2023
ఏ మానవుడికైనా ఆనందంగా జీవించడమే. అలా భావించడం లక్ష్యం. అయితే అందుకోసం మానవుడు బాహ్యప్రపంచంలో వస్తువులలో దేహేంద్రియాలలో వెతుకుతున్నాడు. తాత్కాలిక సుఖాలు, సంపదలతోనే అనందం ఉందన్న భ్రాంతిలో బతికేస్తున్నాడు. అవే శాశ్వతం అనుకుంటున్నాడు.
సంస్కారమే మనిషి తనానికి నిదర్శనం. ఎదుటి వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వడమే ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రమాణికంగా ఎవరైనా భావిస్తారు. అలా మన సంస్కారాన్ని చాటేందుకు మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం నిదర్శనంగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.