శ్రీధర్‌బాబు ఏం చేస్తారో!?

Publish Date:Nov 24, 2013

Advertisement

 

 

 

శాసనసభను ప్రొరోగ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతకం చేశారు. ఆ ఫైలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరకి చేరింది. శ్రీధర్‌బాబు ఆ ఫైల్‌ని ఓకే చేసి ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన దాన్ని గవర్నర్‌కి పంపిస్తారు. అప్పుడు శాసనసభ ప్రొరోగ్ అవుతుంది. శాసనసభ ప్రొరోగ్ అయితే తెలంగాణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ పెరిగే అవకాశం వుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్‌బాబు ఇప్పుడు తనదగ్గర వున్న ప్రొరోగ్ ఫైల్‌ని ముఖ్యమంత్రి దగ్గరకు పంపుతారా లేదా అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది.

 

విభజనవాదులు శ్రీధర్‌బాబు సదరు ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపరని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు రేపు తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వున్న వ్యక్తి కావడం వల్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా చూసే అవకాశం వుందని అంటున్నారు. అయితే సమైక్యవాదులు మరోరకంగా చెబుతున్నారు. స్పీకర్ నుంచి వచ్చిన ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపడం మినహా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల తనకు ఇష్టం వున్నా లేకపోయినా శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపి తీరాల్సిందేనని అంటున్నారు.



అదేవిధంగా నలుగురితోపాటు నారాయణ అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నారే తప్ప శ్రీధర్‌బాబుకు వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్, మృదుస్వభావి అయిన దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టులు గతంలో అన్యాయంగా హతమార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులు సమర్థిస్తూ వుండటం, తెలంగాణ ఏర్పడితో తెలంగాణ మావోయిస్టుల అధికారిక నివాసంగా మారిపోయే సూచనలు కనిపిస్తూ వుండటంతో శ్రీధర్‌బాబుకు తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేదన్నట్టు తెలుస్తోంది. అందువల్ల శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్ విషయంలో సంప్రదాయబద్ధంగా వ్యవహరించి ముఖ్యమంత్రికి పంపే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.