సర్వమతాల అధ్యయన స్వరూపం పరమహంస!!

Publish Date:Mar 10, 2022

Advertisement

భారతీయ ఆధ్యాత్మిక గురువుల చిట్టా విప్పితే అందులో రామకృష్ణ పరమహంస తప్పక ఉంటారు. రామకృష్ణ మిషన్ ద్వారానూ, ఆయన ఆధ్యాత్మిక భోధనల ద్వారానూ ఆదిశంకరాచార్యుల తరువాత ఆధ్యాత్మికతను, హిందూ మతంలో ఉన్న విశిష్టతను ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు ధీటుగా నిలబెట్టిన వారు రామకృష్ణ పరమహంసనే.


బాల్యంలో…..


1836 ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఈయన. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. పేదబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వీళ్ళు ఎంతో విశాలమైన హృదయం కలిగినవాళ్ళు. 


ఈయనలో  సృజనాత్మకత ఎక్కువ. చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకే పెద్దగా చదువుకోలేదు. ఎంతోమంది సాధువులు వీళ్ళ గ్రామం మీదుగా పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అలా వెల్తూ వీళ్ళ గ్రామంలో ఆగినప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎంతో గొప్పగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాటిని ఎంతో ఆసక్తిగా వినేవారు. అలా ఈయనకు భారతీయ ఆధ్యాత్మికత మీద ఒకానొక ఆసక్తి ఏర్పడింది.


వృత్తిలో అన్వేషణ!!


రామకృష్ణుల వారి అన్న ఒక అమ్మవారి గుడిలో పనిచేసేవారు. ఆయన చనిపోయిన తరువాత కుటుంబం కగడవడం కోసం రామకృష్ణులు ఆ గుడిలో పూజరిగా చేరారు. అమ్మవారి విగ్రహంతో మాట్లాడేవారు. అమ్మవారు తనతో మాట్లాడాలని ఎంతో అడిగేవారు. అడవిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని ప్రశ్నలు వేసుకునేవారు. ఎప్పుడూ అమ్మవారి ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారు. ఫలితంగా ఒకసారి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందారు. అప్పటి నుండి తరచుగా అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారు ఈయన. 


అంతేకాదు మిగిలిన మతాలు ఎందుకున్నాయి?? వాటి ప్రత్యేకత ఏమిటి అని విషయం తెలుసుకోవడానికి ముస్లిం మరియు క్రైస్తవ మతాలను అందులో నియమాలను కూడా స్వయంగా ఆచరించి ఆ మతాలను కూడా అధ్యయనం చేసాడు రామకృష్ణులు. ఆ అన్వేషణ ఫలితంగా ఆయన చెప్పింది ఒక్కటే.


మతం అనేది ఆ దేవుడిని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గం మాత్రమే అని. అది మనుషుల మధ్య హింసాత్మక విభేదాలు సృష్టించడానికి కాదని నొక్కి వక్కాణించారు.


వివాహం ఆధ్యాత్మిక బంధం!!


ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు శారదాదేవి గారి వయసు కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే. కానీ రామకృష్ణుల వారు తనకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను అన్నిటినీ ఆమెకు నేర్పించారు. నిజానికి ఆయన మొదటి శిష్యురాలు కూడా ఆయన భార్యే. శారదాదేవి గారు ఎంతో బాగా సులువుగా అర్థం చేసుకునేవారు. అందుకని ఆమెను త్రిపురసుందరీ దేవి ప్రతిరూపంగా భావించి ఆమెను ఎంతో భక్తిగా పూజించేవాడు. ఇలా వాళ్ళిద్దరిమధ్య ఆధ్యాత్మిక బంధమే కొనసాగింది.


గురుశిష్యుల ప్రయాణం!!


రామకృష్ణుల వారి శిష్యులలో ప్రసిద్ధి చెందినవాడు స్వామి వివేకానంద. ఈయన ఎందరో గురువులను ఆశ్రయించి విఫలమై చివరికి  రామకృష్ణులను చేరి సార్థకత పొందాడు. రామకృష్ణుల ఉపన్యాసాలను విదేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించాడు. విదేశాలలో హిందూధర్మం గురించి దైర్యంగానూ గొప్పగానూ చాటి చెప్పాడు.


రామకృష్ణుల వారి శిష్యులు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు. వీళ్ళు ఎవరూ దేన్నీ ఆధారం లేకుండా కారణం లేకుండా సమ్మతించేవారు కాదు. ఆ విధంగా రామకృష్ణులు చెపినా విషయాలు ఎంతో వాస్తవికతను నిండుకుని ఉన్నవే  అయ్యాయి.


అంతిమ దశ!!


ఎందరో గురువులను చూస్తే ఆఖరి దశలో తమ శరీరాన్ని ఏదో మొండి రోగానికి అర్పించి మరణించిన ఆనవాళ్లు కనబడతాయి. రామకృష్ణుల విషయంలోనూ అదే జరిగింది. ఈయన కాన్సర్ బారిన పడి, ఆరోగ్యపరంగా ఎంతో నలిగినా మానసికంగా ఎంతో దృఢచిత్తంతో ఉండేవారు. తనలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను మొత్తం స్వామి వివేకానందకు ధారపోసి 1886 ఆగష్టు 16 వ తేదీన మహాసమాధిని పొందాడు.


ఈయన హిందూసంప్రదయంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు తొలగించడంలో కృషి చేసారు. ఈయనవల్లనే అరభిందో ప్రభావితం అయ్యారు. అలాగే భక్తి ఉద్యమం కూడా ప్రభావితమయ్యింది.


సృష్టిలో ఏకత్వాన్ని, జీవులలో దైవత్వాన్ని, అన్ని మతాలలో ఉన్న మార్గ ముఖ్య ఉద్దేశం దేవుడిని తెలుసుకోవడం చేరడం, మతాలు ఆ మార్గాలు మాత్రమే అనేది ఈయన చెప్పిన గొప్ప సత్యం.

By
en-us Political News

  
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.