ఇది క‌దా ప్ర‌జా పాల‌న అంటే!

Publish Date:Nov 10, 2024

Advertisement

చంద్ర‌బాబు పేరు చెప్ప‌గానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు టెక్నాల‌జీ ముఖ్య‌మంత్రి, దార్శినికతను అరగుడుల నిదర్శనమని చెబుతుంటారు.  నూత‌న టెక్నాల‌జీని అందిపుచ్చుకొని దానిని    పాల‌నకు అన్వయించి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన దిట్ట.   వ‌చ్చే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంలో ముందుకు దూసుకెళ్తుంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి..  ఆ మేర‌కు విజ‌న్ ను రూపొందించ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు మరొకరు లేర‌నే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్ర‌బాబు ముందు చూపే కార‌ణ‌మ‌ని చెప్ప‌డానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అలా చెప్పడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. చంద్ర‌బాబు తొలిసారి సీఎం అయిన స‌మ‌యంలో ఐటీ రంగానికి పెద్ద‌పీట వేశారు. హైటెక్ సిటీని నిర్మించి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీ హ‌బ్ గా మార్చి ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించారు. ఐటీ రంగంలో ఉన్న‌త స్థానాల్లో రాణిస్తున్న తెలుగు వారు అధిక‌ శాతం మంది తాము ఈ స్థాయికి చేరుకోవ‌టానికి చంద్ర‌బాబే కారణమని ఇప్ప‌టికీ చెబుతుంటారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రిగా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. టెక్నాల‌జీని ఉప‌యోగించి అనేక అద్భుత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ రంగంలోనూ రైతులు టెక్నాల‌జీని  అందిపుచ్చుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, 2019లో జగన్ ప్ర‌భుత్వం రావ‌డంతో ఏపీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో టెక్నాల‌జీ వినియోగం లేదు, అభివృద్ధి లేదు. చాలా మంది ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏపీకి తీసుకొచ్చిన కంపెనీల‌ు సైతం జగన్ అరాచక పాలన, అధ్వాన విధానాల కారణంగా ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో ఏపీ అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిపోయింది. జగన్ హయాంలో రాష్ట్రం పురోగమించడం అటుంచి అన్ని రంగాలలోనూ తిరోగమించి  దేశంలోనే చివరి నుంచి మొదటి స్థానానికి దిగజారిపోయింది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లపై అక్ర‌మ కేసులు, దౌర్జన్యాలు, దాడులకే ప్రభుత్వం పరిమితమరైంది. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. అప్పుల కుప్ప‌గా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అంతేకాదు.. నూత‌న సాంకేతికతను అంది పుచ్చుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. 

చంద్ర‌బాబు చొర‌వ‌తో సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం ముందుంటోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా అన్ని రంగాలూ టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అమలు చేస్తున్నారు.    విప‌త్తుల స‌మ‌యంలో డ్రోన్ల‌ను వాడి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించారు. దేశంలోనే తొలిసారిగా ప‌ర్యాట‌క రంగంలోకి విజ‌య‌వంతంగా సీప్లేన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా అవ‌కాశం ఉన్న అన్నిరంగాల్లో టెక్నాల‌జీని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేలా సీఎం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని అవ‌స‌రాల‌కే వినియోగిస్తున్న డ్రోన్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వినూత్నంగా వాడుకుంటున్నది. 

గ‌త సెప్టెంబ‌ర్ లో విజ‌య‌వాడ‌ భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో డ్రోన్ల‌ను ఉప‌యోగించి వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం అందించారు. డ్రోన్ల‌ను ఇలా వినియోగించ‌డం దేశంలోనే తొలిసారి.  చంద్ర‌బాబు తెలివి తేట‌ల‌తో మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు డ్రోన్ల ద్వారా బాధితుల‌కు ఆహార పొట్లాలు, తాగునీటి బాటిల్స్‌ అందించారు. డ్రోన్ల‌ను వ్య‌వ‌సాయ రంగంలోనూ విస్తృతంగా వినియోగించేలా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కృష్ణా న‌ది తీరంలో ఐదు వేల డ్రోన్ల‌తో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న  ఐదు విభాగాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు  న‌మోదు చేసింది. ఓర్వ‌క‌ల్లులో డ్రోన్ హ‌బ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్ర‌పంచ డ్రోన్ డెస్టినేష‌న్ గా ఏపీని నిలపాలని భావిస్తున్నారు. 

తెలుగు వారు ఊహించ‌ని విధంగా ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్‌ను వినియోగించాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. అసలు 2017 డిసెంబ‌ర్ లోనే సీ ప్లేన్ వినియోగంపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఆ త‌రువాత కాలంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు ముందుకు సాగ‌లేదు. వైసీపీ హ‌యాంలో ప‌ర్యాట‌క రంగంలో అభివృద్ధి కుంటుప‌డింది. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంటాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.  2024 ఎన్నికలలో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడంతోనే రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఇటీవ‌ల విజ‌య‌వాడ  శ్రీ‌శైలానికి సీ ప్లేన్ ను ప్రారంభించారు చంద్ర‌బాబు. అందులో ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌టించారు. దేశంలోనే సీ ప్లేన్ లో ప‌ర్య‌టించిన మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు గుర్తింపు పొందారు. దూర‌దృష్టితో అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీని సీఎం చంద్ర‌బాబు ప‌రుగులు పెట్టిస్తున్నారు. చంద్ర‌బాబు  నిర్ణ‌యాలు కార్యాచరణ అంద‌ర్నీ అబ్బుర పరుస్తున్నాయి. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.