టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు!?

Publish Date:Apr 27, 2022

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రెండు పదుల వయసును దాటేసింది. 21 ఏళ్లను పూర్తి చేసుకుని 22లోకి అడుగుపెడుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో 20 ఏళ్లు అంటే చిన్న వయసు కాదు. నిజానికి, తెరాస ఆవిర్భావ సందర్భంలో అయితే అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా అంతకు ముందు ఏర్పడిన పార్టీల బాటలోనే తెరాస కూడా తెరమరుగై పోతుందనే అభిప్రాయమే బలంగా వినిపించింది. అయితే, పుష్కర కాలం పైగా తెరాస సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానంతో 2014 లో విజయవంతమైంది. అది చరిత్ర.

ఇక ప్రస్తుతంలోకి వస్తే, అలా, మఘలో పుట్టి పుబ్బలో పోతుందనుకున్న పార్టీ, ఈరోజు 21సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అంతే కాదు, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెరాస, కాలానుగుణంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ పార్టీగా అందరినీ కలుపుపోయిన తెరాస, రాష్ట్ర ఆవిర్భావ క్షణం నుంచే, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా అవతరించింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది అనేది, కళ్ళ ముందు కదులుతున్న చరిత్ర. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస, ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిపోయిందనే విమర్శలు, ఆ నాటి ఉద్యమ నాయకులే ఆరోపిస్తున్నారు.  

ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం తెరాస భవిష్యత్ విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. అయినా, ముఖ్యమంత్రి ఇజ్జత్ కాసవాల్ గా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించినా, ఫలితం లేక పోవడంతో తెరాసలో భయం మొదలైంది. హుజురాబాద్ ఓటమితో మొదలైన  అలజడి, ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే వుంది. చివరకు, ఎన్నికల వ్యూహరచనలో ఎవరికీ తీసిపోని, కేసీఆర్, దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలుగుతున్న ప్రశాంత్ కిశోర్’ ను ఎంగేజ్ చేసుకున్నారు. ఇందుకు తెరాస నాయకులు ఏకారణం చెప్పినా, తెరాస నాయకత్వానికి విశ్వాసం సన్నగిల్లడం వల్లనే పీకే. ఐప్యాక్ అవసరం ఏర్పడిందని పరిశీలకులే కాదు, ప్రజలు కూడా నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఎవరో అన్నట్లుగా ఇలా ఒక ఉద్యమ పార్టీ, కిరాయి వ్యూహకర్తను వేల కోట్ల రూపాయలు కుమ్మరించి హైర్ చేసుకోవడం, ఉద్యమ స్పూర్తికే అవమానమా అనే మాట వినవస్తోంది.

అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అందుకు ఇంకా కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, అన్నటికంటే ముఖ్యంగా 1200ల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పడుకుపోవదమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే, తెరాస నాయకత్వం మాత్రం, ఆవిషయంలో తగ్గేదేలే, అన్న విధంగా ముందుగు సాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ప్లీనరీ క్రతువు మొత్తం, అంతా (తారక) రామ మయం అన్నవిధంగా సాగుతోంది. అంటే, కుటుంబ పాలనకు జై కొడుతోంది. కేసీఆర్’ స్థానంలో కేటేఆర్’ బొమ్మ కనిపిస్తోంది.ఈ నేపధ్యంలో తెరాస భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది?అనేది కాలమే నిర్ణయించాలి..నిర్ణయిస్తుంది, అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

By
en-us Political News

  
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్‌. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్‌ బ్యాక్‌ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ త‌న క్యాడ‌ర్‌కు హిత‌బోధ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్క‌రి పై బదిలీ వేటు వేస్తూ వ‌స్తున్న. ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసింది.
 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. 
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.