దేశసేవలో తెలుగు తేజం.. డ్రైవర్ నుంచి అమరత్వం వరకు.. 

Publish Date:Dec 9, 2021

Advertisement

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో తెలుగుతేజం, పారా కమాండో బి.సాయితేజ మరణం అందరికీ దుఃఖకారణమే. సాయితేజ అకాల మరణం చిత్తూరు జిల్లా వాసులనే కాకుండా యావత్ తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సాయితేజకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.

లాన్స్ నాయక్ సాయితేజ సొంతూరు చిత్తూరు జిల్లా కురుబకోట మండలం రేడగపల్లె. 29 ఏళ్ల సాయితేజకు భార్య శ్యామల, ఐదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, రెండేళ్ల కూతురు దర్శిని ఉన్నారు. సాయితేజ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరి. సాయితేజ తమ్ముడు మహేష్ కూడా సైన్యంలోనే ఉన్నాడు.భార్య శ్యామలకు ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే సాయితేజ అనంతలోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను దుఃఖసాగరంలో ముంచింది. శ్యామలకు ఫోన్ చేసిన సాయితేజ పిల్లలను చూడాలని ఉందంటూ వీడియోకాల్ లో మాట్లాడాడు. భార్య, పిల్లలతో సంతోషంగా ముచ్చటించాడు. ఫోన్ లో మాట్లాడిన మూడు గంటలకే సాయితేజ మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

శత్రుస్థావరాలపై మెరుపు దాడులు చేయడంలో దిట్ట అని సాయితేజ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సాయితేజ సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భారత సైన్యంలో పారా కమాండోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి పారా ట్రూపర్స్ నుంచి సీడీఎస్ బిపిన్ రావత్ టీమ్కి సాయితేజ ఎంపికవడం విశేషం. సైన్యంలో నిర్వహించే పారా ట్రూపర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సాయితేజ కఠిన శిక్షణ తీసుకున్నాడు. దేశంలో అత్యంత దృఢమైన, శక్తి సామర్ధ్యాలు ఉండేవారే పారాట్రూపర్లు. సీడీఎస్ బిపిన్ రావత్ దృష్టిలో పడి ఆయన వ్యక్తి సిబ్బందిలో ఒకడిగా సాయితేజ చేరాడు. బిపిన్ రావత్ ప్రోత్సాహంతో సాయితేజ పారాట్రూపర్లకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.

సాయితేజ దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తిచేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్ కు హాజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడై 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు.

ఢిల్లీలో ఉన్నా, సొంతూరిలో ఉన్నా ప్రతిరోజూ 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసే వాడు. శరీర దృఢత్వానికి సాయితేజ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తీరు చూసి.. ఊరు ఊరంతా ఆశ్చర్యపోయేదట. క్రికెట్ అంటే కూడా సాయితేజకు ఎంతో ఇష్టమని స్నేహితులు చెబుతున్నారు. రేగడపల్లె యువకులను సాయితేజ క్రికెట్ టోర్నీలకు పంపించి ప్రోత్సహించేవాడని గుర్తుచేసుకుంటున్నారు. గ్రామంలో ఉన్నన్ని రోజులూ అందరితో ఎంతో కలిసిమెలిసి ఉండేవాడని, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించేవాడని చెబుతున్నారు.

ఇంటికి ఎవరెవరో వస్తుండడం, తల్లి శ్యామల భోరున విలపిస్తుండడంతో ఏం జరిగిందో తెలియక సాయితేజ కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని అందరి వంకా దీనంగా చూస్తున్నారు. చిన్నారులను చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది. సిపాయిగా సైన్యంలో చేరిన సాయితేజ తొలుత జమ్ము కశ్మీర్లో విధులు నిర్వర్తించాడు. పారా ట్రూపర్ల శిక్షణలో రాటుదేలిన సాయితేజ కొంతకాలం పాటు పారాట్రూపర్లకు శిక్షణ కూడా ఇచ్చాడు. సాయితేజ శక్తి సామర్ధ్యాలను గుర్తించిన బిపిన్ రావత్ తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేర్చుకున్నారు. సాయితేజను చూసి సీడీఎస్ బిపిన్ రావత్ ఎంతో అభిమానించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మూడు పదుల వయస్సు కూడా నిండని సాయితేజ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. దేశం తలెత్తుకునే స్థాయికి సాయితేజ ఎదిగాడు. విధి నిర్వహణలోనే వీరమరణం పొందాడు. దేశ భద్రతను పర్యవేక్షించే సీడీఎస్కు చీఫ్ సెక్యూరిటీ అధికారి సాయితేజను చూసి యావద్దేశం కన్నీరు పెడుతోంది.   

By
en-us Political News

  
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం.
పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు.
చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు.. పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.
బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు.
అనూహ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన మాధవీలత కు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంత అనూహ్యంగా తెరమీదకు వచ్చారో.. అంతే అనూహ్యంగా తెరమరుగు కానున్నారా? అన్న సందేహాలు బీజేపీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.