బాబును ఫినిష్ చేయడానికి కేంద్రం అనుమతి కోరతారట!

Publish Date:May 30, 2023

Advertisement

తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న జనాదరణ.. వైపీపీ పట్ల వ్యక్తమౌతున్న నిరాదరణతో అధికార పార్టీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యిందా? వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదా? అంటే తమ్మినేని మాటలు వింటే ఎవరైనా ఔననే అంటారు.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయి ఉండీ నోటికి హద్దూ అదుపూ లేకుండా ఇష్టారీతిగా ఆయన మాట్లాడిన మాటలు కచ్చితంగా నేరపూరితమైనవే. ఒక సామాన్యుడి నోటి నుంచి అటువంటి మాటలు వచ్చి ఉంటే ఈ పాటికి కటకటాల వెనుక ఉండేవాడు. లేదూ విపక్షాల వారెవరైనా అధికార పక్ష నేత గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖాకీలు ఇళ్లపై దాడి చేసి మరీ జైలు పాలు చేసి ఉండేవారు. కానీ ఇక్కడ మాట్లాడినది రాష్ట్ర స్పీకర్, అందునా స్పీకర్ అయి ఉండీ వైసీపీ కార్యకర్తల సమావేశంలో విపక్ష నేతను ఫినిష్ చేసేస్తామంటూ మాట్లాడటం అరాచకత్వానికి, విశృంఖలతకూ పరాకాష్ట.

అసలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ రూటే సెపరేటు.. ఆయన ఏం మాట్లాడతారో తెలిసే మాట్లాడతారా అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తరువాత ఆయన ఇంకా అరెస్టు కాకుండా ఉన్నారంటే.. అది స్పీకర్ పదవి ఇచ్చిన రక్షణ కవచమైనా అయి ఉండాలి లేకపోతే.. ఏపీ పోలీసులకు వైసీపీ నేతలను అరెస్టు చేసే ధైర్యం లేకపోవడమేనా అయి ఉండాలి. ఇంతకీ ఆయన చంద్రబాబును ఫినిష్ చేస్తానని అన్నారు. ఔను స్పష్టంగా అవే మాటలు మాట్లాడారు. బ్లాక్ కమెండోల రక్షణ లేకుంటే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని స్పీకర్ తమ్మినేని అన్నారు.

ఆముదాల వలసలో  వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఔను పార్టీ కార్యకర్తల సమావేశంలోనే స్పీకర్ మాట్లాడారు. బ్లాక్ కమాండోలు ఉన్నారన్న ధైర్యంతో ఆయన రెచ్చిపోతున్నారనీ, ఆ రక్షణ లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయేవారనీ తమ్మినేని ఉన్నారు. అలాగే అసలు ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు బ్లాక్ కమాండోల రక్షణ ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు భద్రత ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హోదాలో తాను కేంద్రాన్ని కోరతానని వైసీపీ కార్యకర్తలకు చెప్పారు. అంటే  చంద్రబాబును ఫినిష్ చేయడానికి కేంద్రాన్ని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని అనుమతి కోరుతానని ఆయన అంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  అయినా ఎవరికి జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉండాలో నిర్ణయించాల్సింది ఏపీ అసెంబ్లీ స్పీకర్ కాదన్న విషయం తమ్మినేనికి తెలియదనుకోవాలా? అన్నిటికీ మించి ఇటీవల చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందంటూ ఎన్ఎస్జీ ఉన్నత స్థాయి అధికారులు చంద్రబాబు నివాసం, ఆయన తరచూ వెళ్లే పార్టీ కేంద్ర కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లును ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఆయనకు కమాండోల భద్రతను పెంచారు.

కుప్పం, నందిగామ వంటి చోట్ల వైసీపీ మూకలు ప్రమాదకరంగా ఆయనకు సమీపంలోకి వచ్చి దాడికి  యత్నించారు. వీటన్నిటినీ చూస్తుంటే చంద్రబాబుకు ముప్పు పొంచి ఉన్నది అధికార పార్టీ నుంచేనన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.