భ్రమల్లో జీవిస్తూ...భ్రమల్లో పార్టీని నడిపిస్తున్న సోనియా

Publish Date:Aug 21, 2014

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధి తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై కర్రపెత్తనం చేస్తూ దేశంలో అన్ని వ్యవస్థలను, స్వంత పార్టీని కూడా భ్రష్టు పట్టించారు. కనీసం లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితి కలిగినందుకు ఆమె బాధపడ్డారో లేదో తెలియదు. కానీ చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు ఆమె భరోసా ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. అధికారంలో చేతిలో ఉన్నపుడే పార్టీని తిరిగి గెలిపించుకోలేని ఆమె, కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దుస్థితిలో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించగలనని భావిస్తున్నారో ఆమెకే తెలియాలి.

 

మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికలలో గెలిచారని, గెలిచిన తరువాత ఏమి చేయాలో పాలుపోక దేశ ప్రజలను ఇంకా మభ్య పెడుతూనే ఉన్నారని ఆరోపించారు. ఆయన యూపీఏ పధకాలను, కార్యక్రమాలను అన్నిటినీ కాపీ కొడుతూ అవి తన స్వంత పధకాలుగా చెప్పుకొంటున్నారని ఆమె ఎద్దేవా చేసారు.

 

ఆమె చేసిన ఈ రెండు ఆరోపణలను నిశితంగా పరిశీలించినట్లయితే, ఆమెకు దేశ ప్రజల విజ్ఞతపట్ల వారెన్నుకొన్న ప్రభుత్వం పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధమవుతుంది. ప్రజలకు మంచి చెడ్డా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలూ లేవని, ఎవరు మాయమాటలు చెపితే వారిని గుడ్డిగా నమ్మేసి ఓటేసేస్తారని ఆమె భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక మోడీ ప్రభుత్వం పనిచేయకుండా ప్రజలకు రంగుల కలలు చూపిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ అదే సమయంలో యూపీఏ పధకాలను, కార్యక్రమాలను ఎన్డీయే స్టాంపు వేసుకొని అమలు చేస్తోందని ఆమే స్వయంగా దృవీకరిస్తున్నారు. కాంగ్రెస్ పాలన నచ్చకనే ప్రజలు ప్రజలు ఆ పార్టీని ఇంటికి సాగనంపారు. అటువంటప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేసిన పొరపాట్లనే ఎందుకు అమలుచేస్తుంది? అని ఆలోచిస్తే ఆమె వాదనలో పసలేదని అర్ధమవుతుంది.

 

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నాటి నుండి అన్ని వ్యవస్థలలో సమూలంగా మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుండటం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. బ్రిటిష్ కాలంనాటి ప్రణాళికా సంఘాన్ని, ఆర్.టీ.ఓ. వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో వర్తమాన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా అనుసరిస్తున్న విదేశాంగ విధానాలను కూడా మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగేలా సరికొత్త విధానాలను క్రమంగా అమలులోకి తెస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టే సమయంలో పాకిస్తాన్ కు స్నేహ హస్తం అందించిన నరేంద్ర మోడీ, ఆ తరువాత పాకిస్తాన్ హద్దులు మీరడంతో ఆ దేశానికి ఘాటయిన హెచ్చరికలు జారీ చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.

 

ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వం చాలా దృడమయిన, కటినమయిన నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగయిదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నిద్రావస్తలో జోగుతున్న ప్రభుత్వ వ్యవస్థలు, మోడీ అధికారం చెప్పట్టాక పనిచేయడం మొదలుపెట్టాయి. కానీ సోనియాగాంధీ మాత్రం ఇవేమీ గమనించనట్లు వచ్చే ఎన్నికలలో తాము గెలుస్తామనే భ్రమలలోనే జీవిస్తూ, తమ పార్టీ నేతలని, కార్యకర్తలనీ కూడా అదే భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిధంగా భ్రమల్లో జీవించడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆనందం కలుగుతోందంటే ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది? ఈ ఐదేళ్ళ కాలంలో మోడీ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఈ భ్రమలలోనే జీవించడం అలవాటు చేసుకోవలసి ఉంటుందేమో?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.