బేరసారాలు ఏసీ గదుల్లో జరుగుతాయి.. ఢిల్లీ ఎండల్లో రోడ్డుపై కాదు.!
Publish Date:Jul 24, 2026
Advertisement
సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరశన దీక్ష విరమించిన అనంతరం విమర్శకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆసుపత్రి నుంచి విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో.. ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ 26 రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత కూడా తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్ష విరమణపై కొందరు చేస్తున్న విమర్శలు, లేవనెత్తుతున్న ప్రశ్లకు సమాధానంగా.. 26 రోజుల పాటు నిరశన చేసిన తాను ఎవరి నుంచో క్యారెక్టర్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ద్రవాహారం తీసుకుని దీక్ష ముగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలను ఖండించిన ఆయన.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకుని దీక్ష విరమించానని, ఇందులో ఎలాంటి బ్యాక్ డోర్ ఒప్పందాలూ లేవని కుండబద్దలు కొట్టారు. ఇలా ఉండగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిథులు.. వాంగనిరశన దీక్ష కారణంగా తాను కోలుకోలేనంతగా అనారోగ్యానికి గురయ్యాననీ, 11 కిలోల బరువు తగ్గారని, అవయవాలు, మెదడుపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారు ఏసీ గదుల్లో కూర్చుని చర్చలు జరుపుతారు తప్ప తనలా , ఢిల్లీ ఎండల్లో రోడ్డుపై కూర్చుని నిరాహార దీక్ష చేసి ప్రాణాలపైకి తెచ్చుకోరని వాంగ్ చుక్ ఒకింత ఆగ్రహంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి సమాధానమిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చేపట్టిన ఉద్యమంలో ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే బాధ్యతాయుతమైన హామీలు పొందడం సహజ ప్రక్రియ అన్నారు. వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్లనే ఆయనను దీక్ష విరమించాలని తాము కోరామని, ఆయన సాధించిన హామీలు ఉద్యమానికి తొలి విజయం అని కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంది. Sonam Wangchuk lashes out at critics, Jantarmantar, Prtests, Hunger Strike, Close
http://www.teluguone.com/news/content/sonam-wangchuk-lashes-out-at-critics-36-227039.html





