చంద్రబాబుతో అనుబంధం వెరీ స్పెషల్ అంటున్న సోము!

Publish Date:Mar 11, 2025

Advertisement

పొత్తు సాకుగా చూపి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన పబ్బం గడుపుకుంటోంది. తెలుగుదేశం వ్యతిరేకులకు కూటమి కోటాలో పదవులు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అయినా చంద్రబాబు మిత్రధర్మం, కూటమి బంధం అంటూ క్యాడర్ ను సముదాయించడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే 2019-2024 మధ్య కాలంలో అధికారంలో ఉన్న జగన్ కు వంత పాడి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు ఎమ్మెల్యే కోటీ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టికెట్ లభించడాన్ని తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. అలాగే జనసేనానిపై కూడా సోము అప్పట్లో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ జనసేన క్యాడర్ కూడా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఏమిటని బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. పబ్బం గడిస్తే చాలన్నట్లుగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్నది. 

ఈ నేపథ్యంలో కూటమి పార్టీల అభీష్ఠానికి వ్యితిరేకంగా బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న సోము వీర్రాజు.. ఇప్పుడు చంద్రబాబుతో తన అనుబంధం వెరీ స్పెషల్ అంటున్నారు. ఎంత స్పెషల్ అంటే చంద్రబాబు, మోడీ మధ్య అనుబంధం ఎలాంటిదో.. చంద్రబాబుతో తన అనుబంధం కూడా అలాంటిదేననీ చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ కోవర్టు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అదంతా అవాస్తవమని చెబుతూ 2019లో జగన్ సీఎం అయ్యేంత వరకూ తనకు ఆయనతో పరిచయం కూడా లేదన్నారు. అయితే చంద్రబాబుతో మాత్రం తొలి నుంచీ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని సోము వీర్రాజు చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికలలో సోము అసలు పోటీ యే చేయలేదు.  ఆ తరువాత ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యారు. అయినా కూడా సోము వీర్రాజు ఎన్నడూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లేదు.

అంతే కాకుండా రాజధాని అమరావతి విషయంలో కూడా సోము వీర్రాజు జగన్ విధానాలనే సమర్ధించారు. జగన్ హయాంలో సోము వీర్రాజు వ్యవహార శైలిపై బీజేపీ రాష్ట్ర నేతలే మండిపడ్డారు. సోముకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ వచ్కకచిన తరువాత సోము వీర్రాజు ఒక్క సారిగా స్వరం మార్చేశారు. తాను ఎప్పుడూ అమరావతి రాజధానికే మద్దతుగా నిలిచానని చెప్పుకొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కోసం తాను ఎటువంటి లాబీయింగ్ చేయలేదనీ, బీజేపీ అధిష్ఠానమే తన సీనియారిటీకి గుర్తింపుగా టికెట్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అంతే కాదు మీడియా ముందు ఆయన తాను ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా లేననీ, వైసీపీ విధానాలకు గట్టిగా వ్యతిరేకించాననీ చెప్పుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. మీడియా ఎదుట ఆయన ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ, జగన్ హయాంలో ఆయన వ్యవహరించిన తీరును, ఆయన జగన్ అనుకూల వైఖరినీ ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు తాను వైసీపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని ఎంతగా చెప్పుకున్నా ఎవరినీ నమ్మించలేరు.  

By
en-us Political News

  
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.