వేతన వెతలు.. రివర్స్ పీఆర్సీ.. జగనన్న వృద్ధులనూ వదల్లేదుగా..!

Publish Date:Jan 22, 2022

Advertisement

ఎవరికన్నాఆసక్తి ఉంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ప్రసంగ వీడియోలను చూడండి... ఈ ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి, చేతులు, చూపులు విభిన్న భంగిమల్లో తిప్పుతూ, బహుముఖ విన్యాసాలు చేస్తూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ అంటూ మొదలు పెట్టి ప్రతి తాతకు, ప్రతి అవ్వకు అందరికీ అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అందరితో పాటు అవ్వలు,తాతలను కూడా వదలలేదు. అందరితో పాటు   పింఛనుదార్లను కూడా వదల కుండా వారికీ పీఅర్సీ వాతలు పెట్టారు. అందుకే,  వృద్దల గొంతులు కోశారు, అనే ఆవేదన పింఛనుదార్లు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, జగన్ రెడ్డి దేవుని పేరిట ఆడిన అబద్ధాలను నమ్మి, ఓటేసిన పాపానికి, ‘దేవుడు’ తమకు తగిన శిక్షే వేశారని, తాతలు, అవ్వలు వాపోతున్నారు. 

వివరాలలోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం అర్థ రాత్రి విడుదల చేసిన కొత్త వేతన సవరణ ఉత్తర్వులతో  ఉద్యోగుల నడ్డి విరిచింది. అలాగే,  ఉద్యోగులతో పాటుగా పింఛనుదారులను దారుణంగా దెబ్బ తీసింది. వృద్ధాప్యంతో నానా అవస్థలు పడుతున్న పింఛనుదారుల పించనుకూ కోతలు విధించింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధ పింఛనుదార్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు విధించింది. 

అదే విధంగా వయసుతో పని లేకుండా, ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో పింఛనుదారులు తమకు వాస్తవంగా రావలసిన మొత్తం కంటే, ఇప్పటికే అధికంగా తీసుకున్నారని, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే కరవు భత్యం (డీఆర్) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది.ఇలా వడ్డించిన విస్తరిలోంచి నోటి కాడి కూడును ఎగరేసుకు పోవడం ఏమిటని, వృద్ధ పించారుదారులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఈ పాపం ఉరికే పోదని శపిస్తున్నారు.

ఇతవరకు ఎప్పుడూ కూడా ఇలా, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం లేదని అంటున్నారు. ఇలా, ఇచ్చిది తీసుకునే కొత్త విధానం  కారణంగా కొందరు పింఛనుదారులు లక్ష రూపాయల  వరకు కూడా  నష్టపోతున్నారని, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెతను గుర్తు చేసే విధంగా, పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే అంత్యక్రియల ఖర్చులకు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టింది. ఇంతవరకు పింఛనుదారులు చనిపోతే, అత్యక్రియల ఖర్చుల కోసంగా ప్రభుత్వం,కనీస మొత్తం రూ.15 వేలకు తగ్గకుండా  ఒక నెల పింఛను ఇస్తోంది. అయితే ఇప్పుడు, నెల పింఛను ఎంతున్నా, కనిష్టంగా రూ 15లు గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని కొత్త  ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే నెల పింఛను రూ. 20, రూ.50 వేలు అంతకు ఎక్కువ ఉన్నా, అంత్యక్రియలకు ఇచ్చేది మాత్రం ఆ రూ. 20 వేలు మాత్రమే. జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇంతలా ఎందుకు కక్కుర్తి పడుతోంది ..ఎందుకు  తాతలు, అవ్వలను సైతం క్షోభకు గురి చేస్తోంది? అంటే వినాశకాలే విపరీత బుద్ధి .. అనే సమాధానమే వస్తోంది.

By
en-us Political News

  
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-10
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి లక లక లక అనబోతున్నారు.
రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు. అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు.
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.