వేతన వెతలు.. రివర్స్ పీఆర్సీ.. జగనన్న వృద్ధులనూ వదల్లేదుగా..!

Publish Date:Jan 22, 2022

Advertisement

ఎవరికన్నాఆసక్తి ఉంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ప్రసంగ వీడియోలను చూడండి... ఈ ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి, చేతులు, చూపులు విభిన్న భంగిమల్లో తిప్పుతూ, బహుముఖ విన్యాసాలు చేస్తూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ అంటూ మొదలు పెట్టి ప్రతి తాతకు, ప్రతి అవ్వకు అందరికీ అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అందరితో పాటు అవ్వలు,తాతలను కూడా వదలలేదు. అందరితో పాటు   పింఛనుదార్లను కూడా వదల కుండా వారికీ పీఅర్సీ వాతలు పెట్టారు. అందుకే,  వృద్దల గొంతులు కోశారు, అనే ఆవేదన పింఛనుదార్లు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, జగన్ రెడ్డి దేవుని పేరిట ఆడిన అబద్ధాలను నమ్మి, ఓటేసిన పాపానికి, ‘దేవుడు’ తమకు తగిన శిక్షే వేశారని, తాతలు, అవ్వలు వాపోతున్నారు. 

వివరాలలోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం అర్థ రాత్రి విడుదల చేసిన కొత్త వేతన సవరణ ఉత్తర్వులతో  ఉద్యోగుల నడ్డి విరిచింది. అలాగే,  ఉద్యోగులతో పాటుగా పింఛనుదారులను దారుణంగా దెబ్బ తీసింది. వృద్ధాప్యంతో నానా అవస్థలు పడుతున్న పింఛనుదారుల పించనుకూ కోతలు విధించింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధ పింఛనుదార్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు విధించింది. 

అదే విధంగా వయసుతో పని లేకుండా, ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో పింఛనుదారులు తమకు వాస్తవంగా రావలసిన మొత్తం కంటే, ఇప్పటికే అధికంగా తీసుకున్నారని, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే కరవు భత్యం (డీఆర్) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది.ఇలా వడ్డించిన విస్తరిలోంచి నోటి కాడి కూడును ఎగరేసుకు పోవడం ఏమిటని, వృద్ధ పించారుదారులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఈ పాపం ఉరికే పోదని శపిస్తున్నారు.

ఇతవరకు ఎప్పుడూ కూడా ఇలా, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం లేదని అంటున్నారు. ఇలా, ఇచ్చిది తీసుకునే కొత్త విధానం  కారణంగా కొందరు పింఛనుదారులు లక్ష రూపాయల  వరకు కూడా  నష్టపోతున్నారని, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెతను గుర్తు చేసే విధంగా, పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే అంత్యక్రియల ఖర్చులకు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టింది. ఇంతవరకు పింఛనుదారులు చనిపోతే, అత్యక్రియల ఖర్చుల కోసంగా ప్రభుత్వం,కనీస మొత్తం రూ.15 వేలకు తగ్గకుండా  ఒక నెల పింఛను ఇస్తోంది. అయితే ఇప్పుడు, నెల పింఛను ఎంతున్నా, కనిష్టంగా రూ 15లు గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని కొత్త  ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే నెల పింఛను రూ. 20, రూ.50 వేలు అంతకు ఎక్కువ ఉన్నా, అంత్యక్రియలకు ఇచ్చేది మాత్రం ఆ రూ. 20 వేలు మాత్రమే. జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇంతలా ఎందుకు కక్కుర్తి పడుతోంది ..ఎందుకు  తాతలు, అవ్వలను సైతం క్షోభకు గురి చేస్తోంది? అంటే వినాశకాలే విపరీత బుద్ధి .. అనే సమాధానమే వస్తోంది.

By
en-us Political News

  
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.