Publish Date:May 31, 2023
ఇకపై ఓటీటీలో ప్రసారమయ్యే వాటికి పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కంపల్సరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది కానీ అమలు చేయించడంలో మాత్రం పాలకులు చిత్తశుద్ది ప్రదర్శించాల్సి ఉంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం సినిమా థియేటర్ స్లైడ్స్ లో ప్రచారం చేస్తుంది. తాజాగా పాలకులు ఇటువంటి ప్రచారాలను ఒటీటీ ప్రసారాల్లో కూడా చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడంలో తప్పు లేదు. కానీ పాలకులు గతంలో చేసిన ఉత్తర్వులను అమలు చేయిస్తున్నారా? లేదా అనేది శేష ప్రశ్నగానే మిగులుతుంది. థియేటర్ స్లైడ్స్ లో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెలపై ఉన్న మాదిరిగానే ఒటీటీ ప్రసారాల్లో ఉంటుంది తప్పితే అమలు చేయించే బాధ్యత పాలకులపై ఉండటం లేదు. అదే థియేటర్ ప్రాంగణంలోనే ఇంటర్వెల్ లో పొగలు కక్కే సిగరెట్లను ఊదేసేవారు ఎక్కువగా ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగుట నిషేధం అని మన చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయించే బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. జైలు శిక్ష విధించే అధికారం చట్టాల్లో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ది లోపించినట్లయ్యింది. ఇవ్వాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని తద్దినం మాదిరిగా జరుపుకునే వారే సమాజంలో ఎక్కువయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/smokers-not-punisheble-39-156143.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.