Publish Date:May 18, 2024
ఏపీలో అల్లర్లపై ఈసీ ఆదేశాలతో 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా 13 మంది సీనియర్ పోలీస్ అధికారులను నియమించారు. అయితే, వైసీపీ నాయకులకు మాత్రం ‘సిట్’ ఏర్పాటు కంటగింపుగా మారింది. ఈ సన్నాసులు చేసిన చెత్త పనులన్నీ సిట్ బయటపెడుతుందని భయపడుతున్నారు. ఎన్నికల కోడ్ లేకుండా వుంటే తాము ‘సిట్’ అటే కూర్చుని, ‘స్టాండ్’ అంటే నిల్చునే వాళ్ళతో ‘చాలా పద్ధతి’గా విచారణ జరిపించి వుండేవారు. ఈ ‘సిట్’ ఈసీ ఆదేశాలతో ఏర్పడింది కాబట్టి ఇక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకే వంక దొరకనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టు ‘సిట్’ ఏర్పాటులో రంధ్రాన్వేషణ్ మొదలుపెట్టారు. సిట్ చీఫ్గా నియమితులైన వినీత్ బ్రిజ్లాల్ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్లాల్, చంద్రబాబు హాజరయ్యారట. ఇద్దరూ కలసి పెళ్ళికి వెళ్ళికపోయినా, ఇద్దరూ ఒకేసారి పెళ్ళికి వెళ్ళారు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య స్నేహసంబంధాలు ఉండే అవకాశం వుందట. అందువల్ల ఆయన్ని సిట్ బాధ్యత నుంచి తప్పించాలట. పోయేకాలం వచ్చినవాళ్ళకి పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయంటారు చూశారా.. ఇదీ అలాంటిదే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-on-poll-roits-25-176314.html
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు ఉండటం, వారాంతం కావడంతో ఒక్కసారిగా తిరుమల గిరులకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది.
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వివరాలు
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-2
ఏపీ అసెంబ్లీ.. ఇదిగో అన్ని సర్వేల సారాంశం!
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది.
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ
ఏపీలో ఎవరు గెలవబోతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందా? మరో సారి వైసీపీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందా? ఒకవేళ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీకి ఘోర పరాభవం తప్పదా?