ఫామ్ లోకి వచ్చిన శర్మ, సూర్య... నెదర్లాండ్స్ పై భారత్ విజయం

Publish Date:Oct 27, 2022

Advertisement

ఇద్దరు సూపర్ స్టార్స్ రెచ్చిపోయి ఆడితే ఎలా ఉంటుందో నెదర్లాండ్ ప్లేయర్లకు, ప్రేఓకులకు తెలి సింది. చాలా రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శించాడు. మొన్న పాకిస్తాన్తో తలపడిన మ్యాచ్ లో త్వరలోనే పెవిలియన్ దారిపట్టిన కెప్టెన్ కొంత నిరాశ పరిచాడు. కానీ గురువారం నెదర్లాండ్ తో తలపడిన మ్యాచ్ లో తన పాత ఫామ్ లోకి తిరిగి వచ్చానని అభిమానులకు తన అర్ధసెంచరీ ఢమాకాతో తెలియజేశాడు. మరో వంక కింగ్ కోహ్లీ మళ్లీ తన డాషింగ్ ప్లేను ప్రదర్శించి మరో అర్ధ సెంచరీ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ  తన ఫామ్‌పై విమర్శలు చేసేవారికి ధీటుగా బదులి చ్చాడు. కెప్టెన్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో కూడా కింగ్ కోహ్లీ  44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్  పై గెలిచింది. ముందు బ్యాట్ చేసిన  భారత్  2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 179 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా గత వారం పాక్ తో తలపడిన టీమ్ నే నెదర్లాండ్ తో తలపడేందుకు దించారు. పాక్ తో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘన విజయాన్ని చ్చిన కింగ్ కోహ్లీకి నెదర్లాండ్ మ్యాచ్ కి రెస్ట్ ఇస్తారనే అనుకున్నారు. కానీ కోహ్లీ జట్టులో ఉండడమే కాకుండా మళ్లీ అదే ధాటి ప్రదర్శించి 44 పరుగుల చేయడంలో ప్రేక్షకులను అలరించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడటం భారత్ జట్టు వీరాభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.  సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.  

గత మ్యాచ్ లో ఇద్దరి వైఫల్యం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కాగా, గురు వారం మ్యాచ్ లో  ఓపెనర్ కె.ఎల్. రాహుల్ ఊహించనివిధంగా వెనుదిరిగాడు.  తన వ్యక్తిగత స్కోర్ 9 పరుగుల వద్ద లెగ్ బిఫోర్ అయ్యాడు. అయితే ఏ మాత్రం రివ్యూ కోసం ఆగకుండా వెళిపోవడమే పెద్ద పొరపాటయిందనాలి. నిజానికి తర్వాతి క్షణంలో థర్డ్ అంపైర్ రివ్యూనిపరీక్షించగా అతను నాట్ అవుట్ అని తేలింది. కానీ అప్పటికే రాహుల్ వెళిపోయాడు. ఆ విధంగా రాహుల్ మంచి స్కోర్ చేసే అవకాశం కోల్పోయాడనాలి. నెదర్లాండ్ బౌలర్లను అతను సునాయాసంగా ఎదుర్కొనగలడన్న నమ్మకం కెప్టెన్ శర్మకీ  ఉంది గనుకనే రాహుల్ అలా వెళిపోవడం శర్మను ఆశ్చర్యపరిచింది. 

180 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్, మాక్స్ డౌడ్ నిరాశ పరిచారు. వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. విక్రమ్ కేవలం ఒక్క పరుగు తీసి భువనేశ్వర్ కి దొరికి పోయాడు. అలాగే డౌడ్ కూడా 16 పరుగులు మించి చేయలేకపోయాడు. లెఫ్టీ అక్షర్ పటేల్కి చిక్కి పెవిలి యన్ దారి పట్టాడు. చూస్తుండగానే భారత్ భౌలర్ల ధాటికి నెదర్లాండ్ బ్యాటర్లు క్యూ కట్టడంతో  పది ఓవర్లకు 70 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.  

18వ ఓవర్ చివరికి ఎట్టకేలకు వంద పరుగులు దాటింది. కానీ అప్పటికే 8 వికెట్లు కోల్పోయి విజయా వకాశాలు కోల్పోయింది. భారత్ యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ 18 వ ఓవర్లో చివరి రెండు బంతుల్లో  రెండు వికెట్ల తీశాడు. దీంతో 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధిస్తాడని మళ్లీ అతన్నే కెప్టెన్ బౌలింగ్ కి పిలిచాడు. కానీ హాట్రిక్ సాధించలేకపోయాడు.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో  అత్యధికంగా  టిమ్ ప్రింగ్లే 20 పరుగులు, షారి జ్ అహ్మద్ 16 పరుగులు చేశారు. షారిజ్, మెకరిన్ అజేయంగా నిలిచారు. 

By
en-us Political News

  
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.