షరియా చట్టం అంత భయంకరమా? ఆప్ఘన్లపై ఇక అరాచకలేనా? 

Publish Date:Aug 21, 2021

Advertisement

ఒక్క ఆఫ్ఘనిస్థాన్ ప్రజలనే కాదు, ప్రపంచ దేశాలను కూడా తాలిబాన్లు ఎంతగా ఆందోళనకు  గురిచేస్తోందో చూస్తూనే ఉన్నాం. నిజమే, ప్రపంచాన్ని భయపెడుతోంది, తాలిబాన్లు, వారి అరాచక కృత్యాలే అయినా, తాలిబాన్లను నడిపిస్తోంది, శాసిస్తోంది మాత్రం షరియా చట్టం. తాలిబాన్లు ఎంతగా శాంతివచనాలు వల్లించిన, ఆఫ్ఘన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు వారి పేరు వింటేనే గజగజ వణికి పోతున్నారంటే, అందుకూ కారణం కూడా, తాలిబాన్లు కాదు, వారు అమలు చేసే షరియా చట్టమే. అందుకే ఆఫ్ఘన్ మహిళలను షరియా చట్టం చావును మించిన భయానికి గురిచేస్తోంది.

తాలిబాన్లు ఓ వంక ఆఫ్ఘన్ మహిళలకు పనిచేసే హక్కు, ఓ  స్థాయి వరకు విద్యా చదువుకునే హక్కు ఉంటుందని అంటూనే, మహిళల హక్కులకు. స్వేచ్చకు కూడా  షరియా చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ఈ షరియా అనే పదం చెవిన పడగానే, 20 ఏళ్ల క్రితం నాటి  భయానక అనుభవాలను గుర్తు తెచ్చుకుని మహిళలు భయంతో వణికి పోతున్నారు.  అయితే, ఆఫ్ఘన్ ప్రజలను మరీ ముఖ్యంగా మహిళలను ఇంతలా భయానికి గురిచేస్తున్న షరియా చట్టం, అంటే ఏంటి? మన దేశంలోనూ కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదనను వ్యతిరేకించే లౌకిక వాదులు సమర్ధించే షరియా చట్టం ఏమి చెపుతోంది, అసలేంటి ?  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా షరియా చట్టం అంటే ఏమిటని చూస్తే, ఇది ఇస్లామిక్‌ న్యాయ వ్యవస్థ. ఇందులో ముస్లిం పవిత్ర గంథ్రమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరూ, ఈ చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలనేది చట్టం సారాంశం. నిజంగా షరియా అంతటి దుర్మార్గ చట్టమా, ముస్లింలు అందరూ ఆచరించి తీరవలసిన చట్టమా, అంటే అవునని,కాదనే రెండు వాదనలు ఉన్నాయి.

షరియా చట్టంలో అంతా చెడే కాదు, మంచి కూడా ఉందని, ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు సహా ముస్లింలందరూ పాటించాల్సిన జీవన నియమావళిగా షరియా నిర్దేశిస్తుందని, ఇస్లాం మత పెద్దలు చెపుతారు. షరియా దేవుని కోరికల ప్రకారం ముస్లింలు తమ జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా నడిపించాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని, ఉత్తమ జీవ మార్గాన్ని చూపుతుందని అంటారు. అయితే తాలుబాన్లు, అనిసరించే షరియాలో మాత్రం మంచి మచ్చుకు అయినా కనిపించదు. తాలిబాన్ల షరియా చీకటి దారుల్లోకి తీసుకుపోతుందని కొందరు వాదిస్తారు. షరియా తాలిబాన్ల వెర్షన్, అందులో శిక్షలే కాదు, శిక్షలను బహిరంగా అమలు చేసే పద్దతి కూడా అంతే అమానుషంగా ఉంటుంది.  తాలిబాన్ షరియా ప్రకారం సంగీతం వింటే తప్పు, వీడియోలు చూస్తే పాపం, రోజు ఐదు సార్లు నమాజు చేయక పొతే నేరం, పురుషులు గడ్డం మీద కత్తి పడితే, ఏకంగా పీకే తెగిపోతుంది. మహిళలైతే బుర్జా, హిజాబ్‌ వంటి దుస్తులు ధరించాలి. వీరు ఈ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే, చిన్నా పెద్ద తేడా లేకుండా బహిరంగంగా కాల్చి/కొట్టి  చంపుతారు. అందుకే ఆఫ్ఘన్ మహిళలు షరియా అంటే చావు కేక విన్నతగా భయపడుతున్నారు.  

మరోవైపు పైకి శాంతి వచనాలు పలుకుతున్న తాలిబాన్లు, ఇప్పటికే మహిళల పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబూల్‌లోని పలు వ్యాపార సముదాయాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీల్లో మహిళల చిత్రాలను తాలిబన్లు చింపేశారు. మహిళల బొమ్మలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. మహిళలు ఉన్న పోస్టర్లపై నల్లటి సిరాను పూశారు. మరికొన్ని కనిపించకుండా పరదాలు కప్పారు. దేశీయ టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లలో మహిళలు పనిచేయకూడదని నిషేధం విధించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ స్త్రీ అయినా బురఖా ధరించాల్సి ఉంటుంది. వారు తమ ఇంటిని విడిచి వెళ్లాలనుకుంటే మగ బంధువుతో పాటుగా తీసుకురావాలి.స్త్రీ అడుగుజాడలను ఏ పురుషుడు వినకూడదు కాబట్టి మహిళలకు హైహీల్డ్ బూట్లు అనుమతించారు. బహిరంగంగా బిగ్గరగా మాట్లాడేటప్పుడు ఒక మహిళ వాయిస్ అపరిచితుడికి వినిపించకూడదు. 

వార్తాపత్రికలు, పుస్తకాలు, దుకాణాలు లేదా ఇంటిలో ఆడవారి ఫోటోలు తీయడం, చిత్రీకరించడం లేదా ప్రదర్శించడం అనుమతించరు. మహిళలు తమ బాల్కనీలలో కనిపించడానికి అనుమతించరు.ఇలా అడుగడుగునా ఆంక్షలు, గీతదాటితే, షరియా చట్ట పరిధిలో అమానుష శిక్షలు ..షరియా చట్టం ప్రకారం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలు  (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది. దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు.ఇవనే కాదు, నేరం ఏదైనా శిక్షలు మాత్రం ఆలాగే, ఉంటాయి. అందుకే తాలిబాన్లు అన్నా, వారు  అమలు  చేసే షరియా అన్నా ఆఫ్ఘన్ మహిళలు భయంతో వణికిపోతున్నారు.

By
en-us Political News

  
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.